Share News

Suprme Court: ఆ మహిళా ఆర్మీ అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - May 09 , 2025 | 07:23 PM

భారత సైన్యానికి యువ అధికారులు అవసరమని, ప్రతి సంవత్సరం 250 మంది సిబ్బందికి మాత్రమే శాశ్వత కమిషన్ మంజూరు చేస్తున్నారని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తన వాదనలు వినిపించారు. షార్ట్ సర్వీసు నుంచి విడుదల చేయడానికి సంబంధించి ఎలాంటి స్టే ఇవ్వొద్దని కోర్టును కోరారు.

Suprme Court: ఆ మహిళా ఆర్మీ అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: షార్ట్ సర్వీస్ కమిషన్ కింద ఎంపికైన మహిళా ఆర్మీ అధికారులకు సుప్రీంకోర్టు (Supreme Court) నుంచి స్వల్ప ఉపశమనం లభించింది. వారిని ప్రస్తుతానికి సర్వీసు నుంచి విడుదల చేయవద్దని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. తమకు శాశ్వత కమిషన్‌ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ 69 మంది మహిళా ఆర్మీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్‌ సింగ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ప్రస్తుతం వారిని సర్వీసు నుంచి విడుదల చేయవద్దని, వారి సర్వీసులను వేరే చోట ఉపయోగించుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. ''ఇది కోర్టు చుట్టూ తిరగాల్సిన సమయం కాదు. దేశానికి సేవ చేసేందుకు వారికి మంచి స్థానం ఉంది'' అని జస్టిస్ కాంత్ వ్యాఖ్యానించారు.

India Press briefing: ఆపరేషన్ సింధూర్ లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చిన భారత ప్రభుత్వం


భారత సైన్యానికి యువ అధికారులు అవసరమని, ప్రతి సంవత్సరం 250 మంది సిబ్బందికి మాత్రమే శాశ్వత కమిషన్ మంజూరు చేస్తున్నారని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తన వాదనలు వినిపించారు. షార్ట్ సర్వీసు నుంచి విడుదల చేయడానికి సంబంధించి ఎలాంటి స్టే ఇవ్వొద్దని కోర్టును కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది మనేక గురుస్వామి వాదిస్తూ, ఆపరేషన్ సిందూర్ గురించి ఇటీవల వివరించిన ఇద్దరు మహిళా అధికారుల్లో ఒకరైన సోషియా ఖురేష్ ప్రస్తావన చేశారు. సోఫియా గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందారని, ఇప్పడు దేశాన్ని గర్వపడేలా చేస్తున్నారని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ వరకూ పిటిషన్లు వేసిన అధికారును విడుద చేయవద్దని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది.


Also Read:

India-Pak Tensions: ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారులు.. రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ

Operation Sindoor: ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

China: ఇండో-పాక్ వార్‌పై చైనా షాకింగ్ రియాక్షన్.. ఏమందంటే..

Updated Date - May 09 , 2025 | 07:33 PM