No Helmet No Fuel: నో హెల్మెట్- నో ఫ్యూయల్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు
ABN , Publish Date - Aug 27 , 2025 | 07:26 PM
ఎన్నాళ్లుగానో అమలు చేయాలని భావించిన రోడ్ సేఫ్టీ చర్యలకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 1 నుంచి నో హెల్మెట్ – నో ఫ్యూయల్ అనే కొత్త నియమాన్ని అమలు చేయబోతోంది.
ఎప్పటినుంచో కొత్త రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ అమలు చేస్తామని చెబుతోన్న ఉత్తర్ ప్రదేశ్ (No Helmet No Fuel UP) ప్రభుత్వం ఎట్టకేలకు సిద్ధమైంది. ఈ క్రమంలో నో హెల్మెట్, నో ఫ్యూయల్ విధానాన్ని సెప్టెంబర్ 1 (సోమవారం) నుంచి సెప్టెంబర్ 30 (మంగళవారం) వరకు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అంటే మీరు టూ వీలర్ మీద హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్కి వెళ్తే మీకు పెట్రోల్ పోయరు. టూ వీలర్ రైడర్స్తో పాటు వెనుక కూర్చునే పిలియన్ రైడర్స్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ క్యాంపెయిన్ లక్ష్యమని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా సేఫ్టీ మిషన్
ఈ క్యాంపెయిన్ను డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ నేరుగా సూపర్వైజ్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలతో కలిసి పోలీసులు, రెవెన్యూ అధికారులు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతా కలిసి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి కష్టపడుతున్నారు. అంటే, రాష్ట్రమంతటా ఒకే రకమైన రూల్స్, ఒకే రకమైన అమలు ఉంటుంది. ఎక్కడైనా టూ, వీలర్ వెళ్లేవారు హెల్మెట్ లేకుండా కనిపిస్తే, ఇక వాళ్లకు ఫ్యూయల్ దొరకదని చెప్పవచ్చు.
చట్టం ఏం చెప్పింది?
ఈ మోటార్ వెహికల్స్ యాక్ట్, 1988లోని సెక్షన్ 129 ప్రకారం, టూ-వీలర్ రైడర్తో పాటు వెనుక కూర్చునే వాళ్లు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఒకవేళ రూల్ బ్రేక్ చేస్తే, సెక్షన్ 194D ప్రకారం పెనాల్టీ ఉంటుంది. సుప్రీం కోర్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ కూడా హెల్మెట్ వాడకం పెంచాలని సూచించింది. అందుకే ఈ క్యాంపెయిన్ను మరింత కఠినంగా అమలు చేయాలని చూస్తున్నారు.
పెట్రోల్ బంక్లు కూడా టీమ్లో
ఈ క్యాంపెయిన్లో పెట్రోల్ బంక్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. IOCL, BPCL, HPCL వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పెట్రోల్ పంప్ స్టాఫ్కు స్పష్టమైన ఆర్డర్స్ వచ్చాయి. హెల్మెట్ లేని వాళ్లకు పెట్రోల్ లేదా డీజిల్ ఇవ్వొద్దు. ఈ విషయాన్ని ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మానిటర్ చేస్తుంది.
అంటే, హెల్మెట్ లేకుండా బైక్ తీసుకొచ్చి పెట్రోల్ పోయాలని అడిగితే నో చెప్తారు. మేం ఎవరినీ శిక్షించడానికి ఈ రూల్ తేలేదని, ప్రజల ప్రాణాలు కాపాడడమే మా లక్ష్యమని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బ్రిజేష్ నారాయణ్ సింగ్ అన్నారు. ఈ కొత్త రూల్ రెస్పాన్స్ను బట్టి పొడిగించడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి