Share News

PM Modi Bats for Law to Disqualify: జైలు నుంచి పాలన కుదరదు

ABN , Publish Date - Aug 23 , 2025 | 02:42 AM

తీవ్ర నేరారోపణలతో అరెస్టయిన వ్యక్తులు జైలు నుంచి పాలన సాగించడం ఇకపై కుదరదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 30 రోజులకు పైగా జైలులో ఉన్న పీఎం, సీఎం, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు 31వ రోజున ఆటోమేటిగ్గా పదవిని కోల్పోయేలా తీసుకొచ్చిన బిల్లులను ఆయన సమర్థించారు..

PM Modi Bats for Law to Disqualify: జైలు నుంచి పాలన కుదరదు

50 గంటలు జైల్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగాన్నే కోల్పోతాడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులకు ఈ రూల్‌ వర్తించదా?

  • వారు జైల్లో ఉన్నా ప్రభుత్వంలో కొనసాగుతున్నారు

  • నాయకులే ఇలా ఉంటే.. అవినీతిపై పోరాడేదెలా?

  • కాంగ్రెస్‌ పాలనలో అవినీతిపై పెద్ద చిట్టానే ఉంది

  • బిహార్‌లో ఆర్జేడీ పాలన ‘లాంతరు యుగం’

  • బెంగాల్‌ అభివృద్ధికి తృణమూలే అడ్డంకి: మోదీ

  • బిహార్‌, పశ్చిమ బెంగాల్‌లలో వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

న్యూఢిల్లీ, ఆగస్టు 22: తీవ్ర నేరారోపణలతో అరెస్టయిన వ్యక్తులు జైలు నుంచి పాలన సాగించడం ఇకపై కుదరదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 30 రోజులకు పైగా జైలులో ఉన్న పీఎం, సీఎం, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు 31వ రోజున ఆటోమేటిగ్గా పదవిని కోల్పోయేలా తీసుకొచ్చిన బిల్లులను ఆయన సమర్థించారు. ‘‘50 గంటల పాటు జైలు శిక్ష అనుభవించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మంత్రులకు ఈ నిబంధన ఎందుకు వర్తించదు? వారు జైల్లో ఉన్నా కూడా ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. కొంతకాలం క్రితం కొందరు నేతలు జైళ్ల నుంచే ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం మనం చూశాం. నాయకులే ఇలా ఉంటే... ఇక అవినీతిపై ఎలా పోరాడగలం’’ అని ప్రధాని ప్రశ్నించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో ఆయన శుక్రవారం పర్యటించారు. గయ జీలో విద్యుత్తు,రోడ్డు, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, నీటి సరఫరా రంగాల్లో రూ.13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ ప్రసంగించారు. ఆర్జేడీ పాలనను లాంతరు యుగంగా అభివర్ణించారు. రాష్ట్రాన్ని అంధకారం, అశాంతి, వెనుకబాటుతనంలోకి నెట్టేశారని ఆరోపించారు. బిహార్‌ ప్రజలను ఓటు బ్యాంకుగానే పరిగణించి, వారి ఆకాంక్షలు, గౌరవం, అభివృద్ధిని విస్మరించారని ధ్వజమెత్తారు. ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మూడు బిల్లులను వ్యతిరేకిస్తున్న విపక్షాలపై మోదీ విరుచుకుపడ్డారు.

VX.jpg


కాంగ్రెస్‌, ఆర్జేడీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఒక్క అవినీతి కేసును కూడా ఎదుర్కోలేదని, అయితే 60-65 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో వారి అవినీతికి సంబంధించిన పెద్ద చిట్టానే ఉందని ఎద్దేవా చేశారు. అందుకే ఈ బిల్లులను వారు వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లోని మమత ప్రభుత్వంపైనా ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి టీఎంసీని శత్రువుగా అభివర్ణించారు. మహిళలు, పేదల సంక్షేమం కోసం కేంద్రం పంపిన నిధులను పార్టీ కేడర్‌ కోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం కోల్‌కతాలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్‌ అభివృద్ధి చెందేవరకూ వికసిత్‌ భారత్‌ యాత్ర విజయవంతం కాదన్నారు. టీఎంసీ అధికారంలో ఉన్నంత వరకూ రాష్ట్రంలో అభివృద్ధి అనే మాట ఉండదన్నారు. అధికార దాహంతో ఉన్న టీఎంసీ, కాంగ్రెస్‌ పార్టీలు అక్రమ చొరుబాట్లను ప్రోత్సహిస్తున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ ప్రయోజనాలు దక్కాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. అంతకుముందు కోల్‌కతాలో మూడు కీలక మెట్రో రైల్వే స్టేషన్లు సహా రూ.5,200 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. అలాగే హౌరా-కోల్‌కతా మధ్య కనెక్టివిటీని పెంచనున్న రూ.1,200కోట్లకు పైగా విలువైన 7.2కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కోనా ఎక్స్‌ప్రె్‌సవేకు ప్రధాని శంకుస్థాపన చేశారు.


ఇవి కూడా చదవండి..

చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు

వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్

For More National News And Telugu News

Updated Date - Aug 23 , 2025 | 02:42 AM