Indigo: విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు.. అత్యవసరంగా ల్యాండింగ్
ABN , Publish Date - Jun 17 , 2025 | 01:05 PM
అహ్మదాబాద్ విమాన ఘటనతో ప్రయాణికులు తీవ్ర కలత చెందుతున్నారు. అలాంటి వేళ.. పలు విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి.
ముంబై, జూన్ 17: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అనంతరం దేశంలో పలు ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాల సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికుడికి ఓ విధమైన భయాందోళన కలిగించే పరిస్థితి నెలకొంది. అలాంటి వేళ.. పలు విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. మంగళవారం కొచ్చి నుంచి న్యూఢిల్లీకి ఇండిగో విమానం ప్రయాణికులతో బయలుదేరింది.
ఆ కొద్దిసేపటికే విమానంలో బాంబు ఉందని.. మరికొన్ని నిమిషాల్లో అది పేలనుదంటూ ఆగంతకులు కొచ్చి ఎయిర్పోర్ట్కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ క్రమంలో విమానాన్ని మళ్లించి.. నాగ్పూర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ంగ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
అనంతరం విమానంలోని ప్రయాణికులకు కిందకి దింపేశారు. ఆ తర్వాత విమానాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తరలించి.. తనిఖీలు చేపట్టారు. ఈ విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపులు రావాడంతో వెంటనే మళ్లించామని ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పారు. అలాగే ఈ ఘటనపై కేంద్ర పారిశ్రామిక భద్రత దళాలు, స్థానిక పోలీసులు విచారణ చేపట్టామని ఎయిర్ పోర్ట్ అధికారులు వివరించారు.
ఇవి కూడా చదవండి:
ఇంటికి చేరిన మృతదేహం.. పైలట్ సుమీత్ సబర్వాల్కు ఘన నివాళులు
For National News And Telugu News