Encounter: కోటి రూపాయల బహుమతి ఉన్న మావోయిస్టు సహా 16 మంది మృతి
ABN , Publish Date - Jan 21 , 2025 | 10:14 AM
నిన్న అర్ధరాత్రి జరిగిన ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాల సమాచారం మేరకు ఇప్పటి వరకు 16 మంది మావోలు మరణించినట్లు తెలిపారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) గరియాబంద్ జిల్లా కుల్హాది ఘాట్ అడవుల్లో నిన్న (2025 జనవరి 20) రాత్రి భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఈ ఘటనలో భద్రతా దళాలు 16 మంది నక్సలైట్లను హతమార్చాయి. ఈ ఘటన ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో చోటుచేసుకుంది. నక్సలైట్లతో జరిగిన ఈ భీకర పోరాటంలో 14 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందగా, వారిలో ఒక మహిళా నక్సలైట్ కూడా ఉన్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా గరియాబంద్ జిల్లా డీఆర్జీ (డిస్టిక్ట్ రిజర్వ్ గార్డ్), ఒడిశా సెట్యువల్స్ (SOG), 207 కోబ్రా బెటాలియన్, CRPF సిబ్బంది సంయుక్తంగా పనిచేశాయి. ఈ ఆపరేషన్ను గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా, ఒడిశాకు చెందిన నువాపాడ ఎస్పీ రాఘవేంద్ర గుండాల, డీఐజీ నక్సల్ ఆపరేషన్స్ అఖిలేశ్వర్ సింగ్, కోబ్రా కమాండెంట్ డీఎస్ కథైత్ పర్యవేక్షించారు.
హెలికాప్టర్ ద్వారా సైనికుడి తరలింపు..
ఈ ఎన్కౌంటర్ ఆదివారం రాత్రి ప్రారంభమైన తర్వాత సోమవారం రాత్రి వరకు కొనసాగింది. భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని త్వరగా చుట్టుముట్టడంతో నక్సలైట్లు కూడా కాల్పులు ప్రారంభించారు. దీంతో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత భద్రతా బలగాలు 16 నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. దీంతోపాటు ఈ ఎన్కౌంటర్లో 3 IEDలను (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్) కూడా స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. ఈ ఆపరేషన్లో కోబ్రా బెటాలియన్కు చెందిన ఒక సైనికుడు గాయపడ్డాడు. ఆయనను త్వరగా రాయ్పూర్కు హెలికాప్టర్ ద్వారా తరలించారు. ప్రస్తుతం గరియాబంద్, కుల్హాది ఘాట్ ప్రాంతం పరిసరాల్లో భద్రతా సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు.
కేంద్ర హోంమంత్రి స్పందన..
ఈ ఎన్కౌంటర్లో కోటి రూపాయల బహుమతిని కలిగి ఉన్న ఒక మావోయిస్టు సహా 16 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. మార్చి 2026 నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తాజా ఎన్కౌంటర్ "నక్సలిజానికి మరో బలమైన దెబ్బ" అని అభివర్ణించారు. "నక్సల్ రహిత భారత్ను నిర్మించడంలో మన భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయన్నారు. CRPF, SoG ఒడిశా, ఛత్తీస్గఢ్ పోలీసులు ఒడిశా-ఛత్తీస్గఢ్ సరిహద్దులో సంయుక్త ఆపరేషన్లో 14 మంది నక్సలైట్లను మట్టుబెట్టారు" అని ఆయన Xలో పోస్ట్ చేశారు.
రెండు రాష్ట్రాల బృందాలు..
ఈ ఎన్కౌంటర్ 2025లో జార్జియాబంద్లో జరిగిన నక్సలైట్లకు వ్యతిరేక చర్యలలో భాగంగా జరిగింది. ఇది ఛత్తీస్గఢ్, ఒడిశా పోలీసుల 10 బృందాలు కలిసి చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్లలో ఒకటి. ఈ ఆపరేషన్లో ఒడిశా సోగ్ బృందాలు, ఛత్తీస్గఢ్ పోలీసు బృందాలు, ఐదు CRPF బృందాలు పాల్గొన్నాయి. భద్రతా దళాలు, నక్సలైట్ల సమూహం ఎదుర్కొన్నప్పుడు, వారు మాములుగా ఉపయోగించే ఆయుధాలతో పాటు అనేక దోపిడి పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ పూర్తయిన తర్వాత, గరియాబంద్ ప్రాంతం అంతటా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గతంలో కూడా ఇలాంటి ఘటనలు..
ఈ ఏడాది జనవరి 16న, ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో జరిగిన మరొక ఎన్కౌంటర్లో 18 మంది నక్సలైట్లు హతమయ్యారు. ఈ ఆపరేషన్లో భద్రతా దళాలు మరింత విజయవంతంగా తమ విధులను నిర్వర్తించాయి. ఈ క్రమంలో డీఐజీ అఖిలేశ్వర్ సింగ్, ఛత్తీస్గఢ్లోని నక్సలైట్ల ఏరివేతలో కీలక పాత్ర పోషించారు. మోదీ ప్రభుత్వ విధానంలో నక్సలిజానికి వ్యతిరేకంగా ఆపరేషన్లు మరింత పెరిగాయని చెప్చవచ్చు. 2024లో బస్తర్ డివిజన్లో భద్రతా దళాలు చురుకైన చర్యలు చేపట్టిన నేపథ్యంలో బీజాపూర్, సుక్మాలో జరిగిన అనేక ఆపరేషన్లలో 50 మందికి పైగా నక్సలైట్లు మరణించారు. దీనిపై పలువురు విమర్శలు చేస్తుండగా, మరికొంత మంది మాత్రం సమర్థిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో రెండో అమృత స్నానం గురించి తెలుసా.. వెయ్యేళ్ల యాగాలకు సమానం..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Read More Business News and Latest Telugu News