Share News

Hyderabad: సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తుగడ.. పీఎం కిసాన్‌ యోజన పేరుతో..

ABN , Publish Date - Aug 07 , 2025 | 01:48 PM

ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన స్కీం పేరుతో ఏపీకే లింక్‌ను పంపిన సైబర్‌ నేరగాళ్లు, నగరవాసి ఫోన్‌ను హ్యాక్‌ చేసి ఖాతాలోని రూ.1.95 లక్షలు కాజేశారు. యూసుఫ్‏గూడ ప్రాంతానికి చెందిన వ్యక్తికి కొత్త నెంబర్‌ నుంచి పీఎం కిసాన్‌ పేరుతో ఏపీకే లింక్‌ వచ్చింది.

Hyderabad: సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తుగడ.. పీఎం కిసాన్‌ యోజన పేరుతో..

- రూ.1.95 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన స్కీం పేరుతో ఏపీకే లింక్‌ను పంపిన సైబర్‌ నేరగాళ్లు, నగరవాసి ఫోన్‌ను హ్యాక్‌ చేసి ఖాతాలోని రూ.1.95 లక్షలు కాజేశారు. యూసుఫ్‏గూడ(Yousuf Guda) ప్రాంతానికి చెందిన వ్యక్తికి కొత్త నెంబర్‌ నుంచి పీఎం కిసాన్‌ పేరుతో ఏపీకే లింక్‌ వచ్చింది. లింక్‌ను తెరవగానే.. కిసాన్‌ వికాస్‌ పేరుతో యాప్‌ ఇన్‌స్టాల్‌ అయింది. ఏపీకే ఫైల్‌ మాటున మొబైల్‌లో మాల్‌వేర్‌ జొప్పించిన సైబర్‌ నేరగాళ్లు బాధితుడి ఫోన్‌ను హ్యాక్‌ చేశారు.


city8.2.jpg

యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత ఫోన్‌ తరచూ ఆగిపోవడం, బ్యాటరీ త్వరగా అయిపోవడం, ఫోన్‌ త్వరగా వేడెక్కుతున్నట్లు బాధితుడు గుర్తించినా, ఫోన్‌ హ్యాక్‌ అయినట్లు గుర్తించలేకపోయాడు. ఫోన్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు అతడి ఖాతా నుంచి రూ.1.95 లక్షలు వేరే ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. అంతేగాకుండా వాట్సాప్‌ను హ్యాక్‌ చేసి, స్నేహితులకు, బంధువులకు వేర్వేరు ఖాతా నెంబర్లు పంపి డబ్బు కావాలని కోరారు. ఈ విషయం గ్రహించిన బాధితుడు వెంటనే సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు


ఈ వార్తలు కూడా చదవండి..

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దొంగ డెత్‌ సర్టిఫికెట్‌తో ఎల్‌ఐసీకి టోకరా

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 01:48 PM