Share News

Hyderabad: అయ్యో నిఖిల్‌.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Nov 04 , 2025 | 08:24 AM

ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌ కార్పోరేషన్‌ పరిధిలోని ఇందిరా నెహ్రూనగర్‌లో నివాసముండే నగేష్ గౌడ్‌ కుమారుడు సాయి నిఖిల్‌గౌడ్‌(21) బీటెక్‌ చదువుకుంటూ వనస్థలిపురంలో చెస్‌ ఇనిస్టిట్యూట్‌ నడుపుతున్నాడు.

Hyderabad: అయ్యో నిఖిల్‌.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందంటే..

- ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం(Vanasthalipuram)లో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌ కార్పోరేషన్‌ పరిధిలోని ఇందిరా నెహ్రూనగర్‌(Indira Nehrunagar)లో నివాసముండే నగే్‌షగౌడ్‌ కుమారుడు సాయి నిఖిల్‌గౌడ్‌(21) బీటెక్‌ చదువుకుంటూ వనస్థలిపురంలో చెస్‌ ఇనిస్టిట్యూట్‌ నడుపుతున్నాడు. గౌతమ్‌నగర్‌ డివిజన్‌(Gautamnagar Division)లో నివాసముండే ఓ యువతిని నిఖిల్‌గౌడ్‌ ప్రేమించాడు.


city5..2.jpg

ప్రేమ విఫలం కావడంతో సోమవారం వనస్థలిపురంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి(Malkajgiri MLA Marri Rajasekhar Reddy), కార్పొరేటర్‌ మేకల సునీత తదితరులు నిఖిల్‌ మృతదేహానికి నివాళులర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓటర్ల సమస్యకు సత్వర పరిష్కారం

అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 04 , 2025 | 08:24 AM