Secundrabad: రైల్వే స్టేషన్లో.. 1.600 గ్రాముల గంజాయి చాక్లెట్లు స్వాధీనం
ABN , Publish Date - Oct 15 , 2025 | 08:53 AM
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి చాకెట్లను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్ఫారం నంబరు 10లో మంగళవారం స్పెషల్ టాస్క్ఫోర్స్ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)లో గంజాయి చాకెట్లను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్ఫారం నంబరు 10(Platform number 10)లో మంగళవారం స్పెషల్ టాస్క్ఫోర్స్ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తి పోలీసులను చూసి బ్యాగ్ వదిలేసి పారిపోయాడు. పోలీసులు బ్యాగ్ను స్వాధీనం చేసుకొని చూడగా అందులో 1.600 గ్రాముల గంజాయి చాక్లెట్లు లభించాయి. చాక్లెట్లను సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..
షాకింగ్ .. ఎమ్టీవీ మ్యూజిక్ ఛానల్ మూసివేత
Read Latest Telangana News and National News
