Gold and Silver Rates Today: అంతర్జాతీయ మార్కెట్ ఎఫెక్ట్.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Feb 23 , 2025 | 06:53 AM
బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండ్రోజులపాటు తగ్గుముఖం పట్టిన పసిడి ధర ఆదివారం నాడు స్వల్ప తేడాతో యథావిధిగా కొనసాగుతోంది.

బిజినెస్ డెస్క్: రెండ్రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. పసిడి ధరలను అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు వంటివి ప్రభావితం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా గోల్డ్ ధరలు ఆకాశాన్ని అంటాయి. నూతనంగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయాలతో బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ట్రంప్ నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్న మధుపరులు దాన్ని అధికంగా కొనుగోలు చేస్తున్నారు. అందుకే ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడి బంగారం రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి.
కాగా, https://bullions.co.in/ ప్రకారం.. ఇవాళ (23-02-2025) ఉదయం 06:30 గంటల సమయానికి దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,769 కాగా, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.85,930గా ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.79,026 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.86,210గా ఉంది. మరోవైపు వెండి ధరలూ నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.96,280 గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కేజీ వెండి ధర రూ.96,600 వద్ద కొనసాగుతోంది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.96,450కు చేరింది.
ప్రధాన నగరాల్లో బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు..
చెన్నై- రూ.79,136, రూ.86,330
బెంగళూరు- రూ.78,962, రూ.86,140
కోల్కతా- రూ.78,797, రూ.85,960
భోపాల్- రూ.78,989, రూ.86,170
భువనేశ్వర్- రూ.78,925, రూ.86,100
తిరువనంతపురం-రూ.79,145, రూ.86,340
ముంబై- రూ.78,907, రూ.86,080
పుణె- రూ.78,907, రూ.86,080
జైపూర్- రూ.78,888, రూ.86,060
పట్నా- రూ.78,861, రూ.86,030
ఈ వార్తలు కూడా చదవండి:
వ్యక్తిగత రుణమా? తాకట్టు రుణమా? ఏది బెటర్!
స్పాన్సర్షిప్ సర్వీసులకు జీఎస్టీ ఎవరు చెల్లించాలి?