Nimmala Ramanaidu : డిసెంబరుకల్లా డయాఫ్రం వాల్ పూర్తి చేస్తాం
ABN , Publish Date - Jan 24 , 2025 | 03:51 AM
పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు....
ఇది సగం పూర్తికాగానే ఈసీఆర్ఎఫ్ డ్యాం మొదలు
సమాంతరంగా పునరావాస కార్యక్రమాలు: నిమ్మల
పోలవరం ప్రాంతంలో ప్లాస్టిక్ కాంక్రీటు పనులు ప్రారంభం
పోలవరం, జనవరి 23(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గురువారం ఆయన ప్రాజెక్టును సందర్శించారు. నూతన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘డయాఫ్రం వాల్ పనులు సగం పూర్తవగానే ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు మొదలుపెడతాం. ఫిబ్రవరి 1నాటికి రెండో కట్టర్ పని ప్రారంభిస్తుంది. మూడో కట్టర్ ఏప్రిల్ నాటికి వస్తుంది. నిర్వాసితులకు న్యాయం జరిగేలా ప్రాజెక్టు నిర్మాణంతో పాటే సమాంతరంగా పునరావాస కాలనీలు నిర్మిస్తాం. పోలవరం నిర్మాణం 2027 కల్లా పూర్తిచేస్తాం’ అని తెలిపారు. మరోవైపు.. నూతన డయాఫ్రం వాల్ నిర్మాణంలో భాగంగా ప్లాస్టిక్ కాంక్రీటు పనులు గురువారం ప్రారంభమయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
Fog Effect: గన్నవరం ఎయిర్పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం
Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News