Share News

CM Chandrababu: అదే నేను విశ్వసిస్తా... టీం స్పిరిట్‌తో పనిచేయండన్న సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Feb 07 , 2025 | 02:44 PM

CM Chandrababu: ‘‘టీమ్ వర్క్‌గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని నేను విశ్వసిస్తాను. అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితే తప్ప... విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేం. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్‌తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నదే మా ఆలోచన. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం‘‘ అని సీఎం చంద్రబాబు అన్నారు.

CM Chandrababu: అదే నేను విశ్వసిస్తా... టీం స్పిరిట్‌తో పనిచేయండన్న సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి, ఫిబ్రవరి 7: రాష్ట్ర మంత్రులను పనితీరును ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. వేగవంతమైన పనితీరుతో సత్వర ఫలితాలు సాధిద్దామంటూ మంత్రులకు సూచించారు ముఖ్యమంత్రి. ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్‌ రేట్‌తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారని తెలిపారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు యశక్తులా కష్టపడుతున్నామన్నారు.


పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే... మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నామన్నారు. ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. అయితే ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు.


ఎవరినీ తక్కువ చేయం...

‘‘టీమ్ వర్క్‌గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని నేను విశ్వసిస్తాను. అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితే తప్ప... విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేం. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్‌తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నదే మా ఆలోచన. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం. దస్త్రాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు.. ఎవరినీ తక్కువ చేయడానికి కాదు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే ఇది. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నేను కూడా నా స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంది ‘పీపుల్ ఫస్ట్’ విధానంతో నేను, నా కేబినెట్ సహచర మంత్రులంతా పనిచేస్తున్నాము. లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నాము. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమిష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి... సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలం. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.


మంత్రులకు ర్యాంకులు...

కాగా.. నిన్న ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు విడిగా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్‌పై పెర్ఫార్మెన్స్‌ను సీఎం చదివి వినిపించారు. అలాగే ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రులకు ర్యాంకులు ప్రకటించారు. ఏ మంత్రికి ఏ ర్యాంక్ వచ్చింది.. చివరగా ర్యాంక్ ఎవరికి వచ్చిందనే వివరాలను తెలిపారు సీఎం. మొదటి స్థానంలో ఎన్‌ఎండీ ఫరూఖ్ ఉండగా.. చివరి స్థానంలో మంత్రి వాసంశెట్టి శుభాష్. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరవ స్థానంలో నిలిచారు.


ఇక కందుల దుర్గేష్ 2వ స్థానం, కొండపల్లి శ్రీనివాస్ 3వ స్థానం, నాదెండ్ల మనోహర్ 4వ స్థానం, డోలా బాల వీరాంజనేయులు 5వ స్థానం, సీఎం చంద్రబాబు 6వ స్థానం, సత్యకుమార్ 7వ స్థానం, లోకేష్ 8వ స్థానం, బీసీ జనార్థన్ రెడ్డి 9వ స్థానం, పవన్ కల్యాణ్ 10వ స్థానం, సవిత 11వ స్థానం, కొల్లు రవీంద్ర 12వ స్థానం, గొట్టిపాటి రవికుమార్ 13వ స్థానం, నారాయణ 14వ స్థానం, టీజీ భరత్ 15వ స్థానం, ఆనం రాంనారాయణరెడ్డి 16వ స్థానం, అచ్చెన్నాయుడు 17వ స్థానం, రాంప్రసాద్ రెడ్డి 18వ స్థానం, గుమ్మడి సంధ్యారాణి 19వ స్థానం, వంగలపూడి అనిత 20వ స్థానం, అనగాని సత్యప్రసాద్ 21వ స్థానం, నిమ్మల రామానాయుడు 22వ స్థానం, కొలుసు పార్థసారధి 23వ స్థానం, పయ్యావుల కేశవ్ 24వ స్థానంలో ఉండగా.. ఇక చివరి 25వ స్థానంలో వాసంశెట్టి సుభాష్ నిలిచారు.


ఇవి కూడా చదవండి..

హైడ్రా దూకుడు.. ఎయిర్ పోర్టు దగ్గర..

గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 07 , 2025 | 02:44 PM