AP Govt: మద్యం కుంభకోణం వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Feb 07 , 2025 | 03:49 PM
AP govt: మద్యం కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే నియమించిన సిట్ బృందంలో మరికొంతమంది అధికారులను చేరుస్తూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం.

అమరావతి, ఫిబ్రవరి 7: వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం (AP Govt) దూకుడు పెంచింది. రెండు రోజుల క్రితం విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ బృందాన్ని ప్రభుత్వం (AP Govt) నియమించింది. ఇందులో తాజాగా ఎక్సైజ్ శాఖ అధికారులను కూడా బృందంలో సభ్యులుగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ.స్వామినాధన్, ఎ.జనార్ధన్ రావు, ఇన్స్పెక్టర్లు వైకుంఠరావు, దుర్గా ప్రసాద్, రమేష్, శేషయ్య, శ్రీనుబాబు, రమణలను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం. వీరందరినీ వెంటనే రిలీవ్ చేసి విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా.. మద్యం కుంభకోణంపై నియమించిన సిట్ బృందం సీఐడీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని.. ప్రతీ 15 రోజులకు ఒకసారి నివేదికను రూపొందించి సీఐడీ చీఫ్ ద్వారా ప్రభుత్వానికి అందించాలని గతంలోనే ఆదేశించింది. ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం సిట్కు ఉంటుందంటూ వారికి పోలీస్స్టేషన్ను కూడా ఏర్పాటు చేసి.. అధికారాలను కట్టబెట్టింది కూటమి ప్రభుత్వం. తాజాగా మద్యం కుంభకోణంపై విచారించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా అవసరం అవుతారని ప్రభుత్వం భావించింది. దీంతో ఎక్సైజ్ అధికారుల సహకారం తీసుకునేందుకు ఆ డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులను సిట్ బృందంలో నియమించాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ప్రభుత్వానికి వినతి చేశారు.
మహాకుంభమేళాకు వెళ్తూ రైల్లో అమ్మాయిల పిచ్చి వేషాలు.. చివరికి..
సపోర్టింగ్ స్టాఫ్లాగా వీరందరినీ నియమిస్తూ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. సిట్ బృందంలో ఇప్పటికే రాజశేఖర్ బాబుతో పాటు ఎస్పీలు, అడిషినల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలను నియమించారు. ఇప్పుడు తాజా వీరికి సహకరించేందుకు ఎక్సైజ్ సూపరింటెండెంట్లను, ఇన్స్పెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం అంతా కూడా మద్యంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి సహకరించాలని తెలిపారు. అలాగే సిట్ బృందం అడిగిన వివరాలను సంబంధిత శాఖలు వెంటనే ఇవ్వాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
CM Chandrababu: అదే నేను విశ్వసిస్తా... టీం స్పిరిట్తో పనిచేయండన్న సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News