Share News

Operation Sindoor: ఢిల్లీ ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ABN , Publish Date - May 09 , 2025 | 01:58 PM

Operation Sindoor: భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం ఢిల్లీలోని ఆంధ్రభవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

 Operation Sindoor: ఢిల్లీ ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
CM Chandrababu Naidu

న్యూఢిల్లీ: భారత్ (India), పాకిస్తాన్‌ల (Pakistan) మధ్య ఉద్రిక్తతల (Tensions) నేపధ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడు (AP CM Chandrababu) కీలక నిర్ణయం (Key decision) తీసుకున్నారు. ఢిల్లీ (Delhi)లోని ఏపీ భవన్‌ (AP Bhavan)లో కంట్రోల్ రూమ్ (Control Room) ఏర్పాటు చేశారు. పాకిస్తాన్‌తో సరిహద్దు గల రాష్ట్రాలలో ఉన్న లేదా ఆ రాష్ట్రాలకు వెళుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని సీఎం వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్, లడక్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్న లేదా రాష్ట్రాలకు వెళుతున్న ఆంధ్రులు సమాచారం, సహాయం కొరకు నిరంతరం (24x7) పనిచేసే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చునని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.


కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ వివరాలు

011-23387089

9871999430

9871999053

అదనపు సమాచారం లేదా సహాయం కొరకు ...

ఎం.వి.ఎస్. రామారావు, డిప్యూటీ కమిషనర్ - 98719 90081

వి. సురేష్ బాబు.. లైజన్ ఆఫీసర్ - 9818395787

Also Read: మోదీ హయాంలో వాయుసేన రక్షణ, దాడి సామార్ధ్యాల బలోపేతం..


ప్రస్తుత పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, కేంద్ర ప్రభుత్వం, సరిహద్దు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ, రాష్ట్ర ప్రజలకు అన్ని సహాయ సహకారాలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ భవన్ కృషి చేస్తోంది. ఈ సందర్భంగా, జారీ చేయబడిన అధికారిక సూచనలను పాటించాలని సంబంధిత అధికారులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మిస్ వరల్డ్ 2025 వేడకలు..

ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్

పాక్ దాడులపై ఎక్స్‌లో భారత ఆర్మీ పోస్ట్

For More AP News and Telugu New

Updated Date - May 09 , 2025 | 02:01 PM