Share News

Toppudurthi Inquiry Delayed: తోపుదుర్తి విచారణ నేటికి వాయిదా

ABN , Publish Date - May 12 , 2025 | 04:51 AM

రామగిరి మండలం కుంటిమద్ది హెలీప్యాడ్‌ కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి విచారణ సోమవారానికి వాయిదా. బందోబస్తు కారణంగా విచారణ వాయిదా వేసినట్లు సీఐ శ్రీధర్‌ తెలిపారు

Toppudurthi Inquiry Delayed: తోపుదుర్తి విచారణ నేటికి వాయిదా

చెన్నేకొత్తపల్లి, మే 11(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటిమద్ది హెలీప్యాడ్‌ కేసులో ప్రధాన నిందితుడు, రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఆదివారం విచారణకు హాజరవుతానని విచారణాధికారి రామగిరి సీఐ శ్రీధర్‌కు తోపుదుర్తి సమాచారం అందించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌, హోంమంత్రి అనిత, ఇతర మంత్రులు అగ్నివీర్‌ వీర జవాన్‌ మురళీనాయక్‌ అంతక్రియలలో పాల్గొనేందుకు జిల్లాకు రావడంతో బందోబస్తులో ఉన్నందున విచారణను వాయిదా వేసినట్టు సీఐ శ్రీధర్‌ తెలిపారు. సోమవారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలోని పోలీసు సర్కిల్‌ కార్యాలయంలో ప్రకాశ్‌రెడ్డిని విచారించనున్నట్టు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు

Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు

Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..

Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన

Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్

For Andhrapradesh news and Telugu News

Updated Date - May 12 , 2025 | 04:51 AM