Share News

3rd World Telugu Mahasabha 2026: ప్రపంచ తెలుగు మహాసభలు.. పెయింటింగ్స్‌కు ఆహ్వానం

ABN , Publish Date - Oct 11 , 2025 | 09:07 PM

మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు గుంటూరు మహానగరం వేదికవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర కళా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆంధ్రసారస్వత పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ వెల్లడించారు.

3rd World Telugu Mahasabha 2026: ప్రపంచ తెలుగు మహాసభలు.. పెయింటింగ్స్‌కు ఆహ్వానం
andhra saraswatha parishath

గుంటూరు, 11 అక్టోబర్ : గుంటూరులో నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు వేదికగా అద్భుతమైన చిత్ర కళా ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. 2026, జనవరి 3, 4, 5 తేదీల్లో ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని వివరించారు. అందులో భాగంగా స్థానిక శ్రీ సత్యసాయి స్పిర్చివల్ సిటీ ప్రాంగణంలో ‘మన అమరావతి’ పేరుతో చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


ఈ ప్రదర్శనలో తెలుగు సంస్కృతి, తెలుగు భాషా వైభవం, ఆంధ్రప్రదేశ్ కీర్తి, పర్యావరణంతోపాటు ప్రకృతి సౌందర్యం తదితర అంశాలను ప్రతిబింబించే "చిత్రకళా కృతులను" ప్రదర్శించేందుకు వర్ధమాన, ప్రముఖ చిత్రకారులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అయితే ఈ ప్రదర్శనలో ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలను మాత్రం అనుమతించబోమని స్పష్టం చేశారు.


ఇక ఈ ప్రదర్శనలో పాల్గొనే ప్రతీ కళాకారునికి ప్రశంసా పత్రంతోపాటు ఈ మహాసభల అభినందన పతకం అందిస్తామని వివరించారు. చిత్రకారులు తమ చిత్రాలను కింద చిరునామాకు 2025, డిసెంబర్ 15వ తేదీ లోపు పంపాల్సి ఉంటుందని ఈ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కింది చిరునామాకు పంపాలని సూచించారు.


చిరునామా:

ఎస్. విజయ్ కుమార్

సమన్వయకర్త – చిత్ర కళా ప్రదర్శన “మన అమరావతి”

202, సత్యవతి హోమ్స్,

కనకమేడల కన్వెన్షన్ ఎదురుగా,

మెయిన్ రోడ్, ఎస్‌విఎన్ కాలనీ,గుంటూరు 522006

సెల్ నెంబర్ : 9849503860.

నిబంధనలు..

గీసిన చిత్రాలు పరిమాణం: గరిష్ఠం 24” x 30” ఉండాలని,ఏదైనా ఫ్రేమ్ చేసి ప్రదర్శనకు సిద్ధంగా ఉండాలనీ కోరారు. ఇక ఈ ప్రదర్శనలోని ఆయా చిత్రాలు విక్రయం జరిగితే.. వచ్చిన నగదు మొత్తాన్ని నేరుగా ఆయా కళాకారులకు అందజేయ బడుతుందని స్పష్టం చేశారు.


తెలుగు సాంస్కృతిక గౌరవాన్ని ప్రతిబింబించే ఈ మహత్తర కళా ప్రదర్శనలో మీ విలువైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని కార్యదర్శి శ్రీ ధవేజి , ముఖ్య సమన్వయకర్త శ్రీ పి.రామచంద్ర రాజు, సహ సమన్వయకర్త వి.విద్యాసాగర్‌ తెలిపారు.

మరిన్ని వివరాలు కోసం..

డా. గజల్ శ్రీనివాస్

అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్

సెల్ నెంబర్: 9849013697

000

పి.రామచంద్ర రాజు

ముఖ్య సమన్వయ కర్త–

3వ ప్రపంచ తెలుగు మహాసభలు- 2026

ఈ వార్తలు కూడా చదవండి..

అన్ని మున్సిపాల్టీల్లో స్మార్ట్ స్ట్రీట్ బజార్లు

కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 11 , 2025 | 09:09 PM