CM Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు గైర్హాజరు.. సీఎం సీరియస్
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:13 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 25: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు లేటుగా హాజరై.. కొద్దిసేపు సభలో ఉండి.. ఆ వెంటనే ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గమనించి.. వారిపై సీరియస్ అయ్యారు. గురువారం అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి.. సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.
ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు గమనించి.. ఎమ్మెల్యేల హాజరుపై చీఫ్ వీప్ జీవీ ఆంజనేయులును ఆరా తీశారు. ఆయన వెంటనే అసెంబ్లీలోని వీప్లను అప్రమత్తం చేశారు. దీంతో అప్పటికప్పుడు అసెంబ్లీకి హాజరుకావాలంటూ సుమారు 15 మంది ఎమ్మెల్యేలను ఆదేశించారు. అలాగే ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానీ ఎమ్మెల్యేలకు సైతం విప్లు ఫోన్లు చేసి ఎందుకు హాజరు కాలేదంటూ ప్రశ్నిస్తున్నారు.
ప్రజా సమస్యలు.. రాష్ట్రాభివృద్ధిపై చర్చించేందుకు అసెంబ్లీ చక్కటి వేదిక అని సీఎం చంద్రబాబు నాయుడు నమ్ముతారు. అందుకే ఆయన ఈ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరువుతారు. ఆ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలంటూ వైసీపీ అధినేతతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన కీలక సూచన చేశారు.
అలాంటిది ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీ సమావేశాలకు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సీరియస్ అయ్యారు. ఈ వర్షా కాల అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభమైనాయి. ఇవి 10 రోజుల పాటు జరగనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సిలిండర్ పేలితే.. భారీగా పరిహారం.. ఈ విషయం తెలుసా?
నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి
Read Latest AP News And Telugu News