Pawan kalyan: ప్లాస్టిక్ రహిత ఏపీ కోసం కృషి: డిప్యూటీ సీఎం
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:29 PM
ప్లాస్టిక్.. భూమిలో కలవడానికి 300 ఏళ్లు పడుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. పశువుల కడుపులోకే కాదు.. పసికందుల రక్తంలో కూడా ఇది కలిసి పోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 19: ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు త్వరలో యాక్షన్ ప్లాన్ తీసుకొస్తామన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పౌరులను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. వీటి నియంత్రణకు ముందుకు రావాలంటూ ఈ సందర్భంగా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం అసెంబ్లీలో ప్లాస్టిక్ వినియోగంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన జీవితాల్లో ప్లాస్టిక్ ఒక భాగం అయిపోయిందన్నారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు.
తిరుమలలో ప్లాస్టిక్ నిషేధాన్ని క్రమశిక్షణతో అమలు అవుతుందని గుర్తు చేశారు. ప్లాస్టిక్ నియంత్రణ అనేది రాజకీయ నేతల నుంచే ప్రారంభం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఫ్లెక్సీల వాడకం విచ్చలవిడిగా పెరిగి పోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏ చిన్న కార్యక్రమం అయినా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.
ఒక్క సారి వాడిన ప్లాస్టిక్ను నియంత్రించడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. సచివాలయంలో ప్లాస్టిక్ ఫ్రీగా ప్రకటించామని.. దాంతో గాజు బాటిళ్లలో నీరు ఇస్తున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్ ఎకానమీలో భాగంగా పార్కులు, ప్లాస్టిక్ రీ సైకిలింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.
బయోడీగ్రేడబుల్ తయారీ పరిశ్రమలను ప్రోత్సాహిస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించి క్రియాశీలక పాత్ర పోషించాలంటూ పౌరులకు ఆయన సూచించారు. రాజకీయ పార్టీలు ప్లెక్సీలు పెడుతున్నాయని.. ప్లాస్టిక్ బాటిళ్లు, గ్లాసులు పర్యవరణాన్ని కలుషితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్లాస్టిక్.. భూమిలో కలవడానికి 300 ఏళ్లు పడుతుందని చెప్పారు. పశువుల కడుపులోకే కాదు.. పసికందుల రక్తంలో కూడా ఇది కలిసి పోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ మైక్రో, న్యానో ప్లాస్టిక్ రూపంలో ఉండి పోతున్నాయని.. దీనిపై రెండు మూడు నెలల్లో డీటెయిల్డ్ ప్లాన్తో వస్తున్నామని వివరించారు. నిర్మల్ గ్రామ పురస్కారం తరహలో ప్లాస్టిక్ రహిత గ్రామాలకు ఇన్సెంటీవ్ ఇస్తామని ప్రకటించారు. వచ్చే సెషన్లో పర్యావరణం, కాలుష్యంపై ప్రత్యేక చర్చ జరుగుతుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్కు బిగ్ షాక్.. టీడీపీలోకి మరో నేత!
విజయవాడకు ఎంపీ మిథున్రెడ్డి..
For More AP News And Telugu News