Cheeramenu Fish: రికార్డు స్థాయిలో చీరమేను ధర.. పోటెత్తిన మాంసాహార ప్రియులు
ABN , Publish Date - Oct 17 , 2025 | 08:43 AM
దీపావళి రోజుల్లో గోదావరి, సముద్ర సంగమ ప్రాంతంలో లభించే అరుదైన చేప చీరమేను. దీనిని కొనుగోలు చేసేందుకు శుక్రవారం యానాంకు మాంసాహార ప్రియులు పోటెత్తారు.
యానాం, అక్టోబర్ 17: దీపావళి రోజుల్లో గోదావరి, సముద్ర సంగమ ప్రాంతంలో లభించే అరుదైన చేప చీరమేను. దీనిని కొనుగోలు చేసేందుకు శుక్రవారం యానాంకు మాంసాహార ప్రియులు పోటెత్తారు. దీంతో సెరు చీరమేను ధర రూ. 16 వేల వరకు పలికింది. పెద్దదారం సైజులో ఉండే చీరమేనును మత్స్యకారులు లీటర్ల లెక్కన విక్రయిస్తారు.తూర్పు గాలులు వీచే వేళ.. సముద్రం, గోదావరి నది కలిసే ప్రాంతంలో ఇది లభిస్తుంది. ఈ సమయంలో నీటి అడుగు భాగం నుంచి అవి నీటిపైకి చేరుకొంటాయి. ఈ చీర మేనను ఈ రోజు మత్స్యకారులు భారీగా మార్కెట్కు తీసుకు వచ్చారు. దాంతో స్థానిక రాజీవ్ బీచ్లోని పుష్కర్ ఘాట్ వద్ద సందడి వాతరవరణం నెలకొంది.
శీతాకాలం ప్రారంభంలో.. మరి ముఖ్యంగా దీపావళి ముందు దశమి, ఏకాదశ రోజుల్లో ఈ చీరమేను లభ్యమవుతుంది. వీటిని కొనుగోలు చేసేందుకు మాంసహార ప్రియులు పోటీ పడ్డారు. గత రెండు రోజుల క్రితం సెరు రూ. రెండు వేలకుపైగా విక్రయించారు. ప్రస్తుతం సెరు ధర రూ.1,600కు విక్రయిస్తున్నారు. మరో వారం రోజుల పాటు చీరమేను లభ్యమవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ చీరమేనుకు మసాలా దట్టించి వేపుడుగా చేస్తారు. అలాగే చింతకాయ తొక్కుతో కూరగా కూడా వండుకుంటారు. దీనిని గారెలతో కలిపి తినేందుకు మాంసాహార ప్రియులు అమితంగా ఇష్ట పడతారని చెబుతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
For More AP News And Telugu News