AP Govt: సంభావన పథకానికి టీటీడీ నిధులు
ABN , Publish Date - Oct 17 , 2025 | 06:28 AM
నిరుద్యోగ వేదపండితులకు టీటీడీ ద్వారా సంభావన పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ఉత్తర్వులు జారీ చేసిన దేవదాయ శాఖ
అమరావతి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ వేదపండితులకు టీటీడీ ద్వారా సంభావన పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దేవదాయ శాఖ ఎక్స్ ఆఫీషియో కార్యదర్శి హరిజవహర్లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 600 మంది వేదపండితులకు సంభావన కింద ఈ శాఖ నెలకు రూ.3 వేలు అందిస్తుంది. ఇందుకోసం ప్రతినెలా రూ.2.16 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ నిధులను రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల నుంచి సమకూర్చస్తోంది. ఇది కొంచెం భారం కావడంతో ఈ పథకానికి టీటీడీ నిధులు కేటాయించాలని దేవదాయ శాఖ కమిషనర్ కోరారు. ఈ ప్రతిపాదనను టీటీడీ బోర్డు ఆమోదించింది.