Share News

YCP: అన్నవరంలో అధికారులపై రెచ్చిపోయిన అనంతబాబు

ABN , Publish Date - May 09 , 2025 | 11:29 AM

అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఓవరాక్షన్ చేశారు. తనకు తగిన గౌరవం ఇవ్వలేదని ఆలయం ఈవో, అధికారులపై రెచ్చిపోయారు. ఓ అధికారిని ఉద్దేశించి దూషణలకు దిగారు.

 YCP: అన్నవరంలో అధికారులపై రెచ్చిపోయిన అనంతబాబు
MLC Anantha Babu

అన్నవరం: వైసీపీ ఎమ్మెల్సీ (YCP MLC) అనంతబాబు (Anantha Babu) అన్నవరం (Annavaram) సత్యదేవుని ఆలయం (Temple)లో ఓవరాక్షన్ (Overaction) చేశారు. గురువారం స్వామివారి కల్యాణం జరిగింది. ఈ సందర్భంగా అనంతబాబు సత్యదేవుని దర్శించుకున్నారు. అనంతరం అక్షింతలు ఆలస్యమవడంతో ఆయన ఆలయ అధికారులపై ఇలా రెచ్చిపోయారు. ‘వాడెవడు.. వాడి పెత్తనం ఏమిటిక్కడ’ అంటూ ఓవరాక్షన్ చేస్తూ రెచ్చిపోయారు. ఆలయానికి వచ్చిన తనకు తగిన గౌరవం ఇవ్వలేదంటూ హడావుడి చేశారు. అక్షింతలు ఇవ్వలేదని కల్యాణ వేదిక వద్దే ఉండిపోయారు. ముఖ్య అతిథులు వెళ్లిపోయినా అనంతబాబు అక్కడే ఉండి అక్షింతలు ఇవ్వాలని పట్టుపట్టారు. ఈవో సుబ్బారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ అధికారిని ఉద్దేశించి దూషణలకు పాల్పడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.


మరోవైపు ఏపీలో పెను సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ హత్యకు సంబంధించి నిందితుడు వైసీపీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు విచారణను పూర్తిగా నీరుగార్చిన పరిస్థితి. అదే విధంగా ఛార్జ్‌షీట్‌ దాఖలులో అనేక లోపాలు కనిపించాయి. దీంతో ఈ కేసులో పురోగతి కనిపించకుండా పోయింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఎట్టకేలకు కేసులో కదలిక వచ్చింది. ఈ కేసుకు సంబంధించి న్యాయం చేయాలంటూ బాధితులు కోరగా.. అందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ కూడా హామీ ఇచ్చారు.

Also Read: ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్


అందులో భాగంగా పునర్విచారణ దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఈ కేసు పునర్విచారణకు కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశించారు. విచారణాధికారిగా ఐపీఎస్ అధికారి మనీశ్ దేవరాజ్ పాటిల్‌ను నియమించారు. ఈ కేసుకు సంబంధించి 60 రోజుల్లో డీజీపీ, ఎస్పీకి నివేదిక ఇవ్వాలని దేవరాజ్ పాటిల్‌ను ఆదేశించారు. నివేదికతో కోర్టులో అదనపు ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాక్ దాడులపై ఎక్స్‌లో భారత ఆర్మీ పోస్ట్

యుద్ధ వాతావరణం.. సైరన్లు మోగుతున్నాయి...

For More AP News and Telugu News

Updated Date - May 09 , 2025 | 11:29 AM