సంపన్నుల నగరంగా హైదరాబాద్..
ABN, Publish Date - Aug 30 , 2024 | 09:54 AM
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నిజంగానే భాగ్యనగరం అని తాజాగా మరోమారు వెల్లడైంది. దేశంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న నగరాల జాబితాలో దక్షిణాదిలో నెంబర్వన్గా నిలవటమేగాక దేశంలో ఢిల్లీ, ముంబై తర్వాత మూడో స్థానంలో నిలిచింది.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నిజంగానే భాగ్యనగరం అని తాజాగా మరోమారు వెల్లడైంది. దేశంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న నగరాల జాబితాలో దక్షిణాదిలో నెంబర్వన్గా నిలవటమేగాక దేశంలో ఢిల్లీ, ముంబై తర్వాత మూడో స్థానంలో నిలిచింది. హైదరాబాద్లో 18 మంది బిలియనీర్లు (వందకోట్ల డాలర్లు అంటే రూ.8,388 కోట్ల నికర సంపద ఉన్నవారు), 104 మంది సంపన్నులు (రూ.వెయ్యి కోట్ల నికర సంపద ఉన్నవారు) ఉన్నారని గురువారం విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ -2024 వెల్లడించింది.
ఇప్పటి వరకూ మూడోస్థానంలో ఉన్న బెంగళూరును వెనక్కినెట్టి హైదరాబాద్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుందని తెలిపింది. రూ.76,100 కోట్ల నికర సంపదతో మురళీ దివి కుటుంబం హైదరాబాద్ బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉంది. నగరానికి చెందిన పి.పిచ్చిరెడ్డి (రూ.54,800 కోట్లు), పీవీ కృష్ణారెడ్డి (రూ.52,700 కోట్లు), బి.పార్థసారథిరెడ్డి (రూ.29,900 కోట్లు) రిచ్ లిస్ట్ జాబితాలో ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నిందితులకు శిక్ష పడాలి: జెత్వాని
ఎమ్మెల్సీ అనంతబాబు అక్రమాలపై సర్కార్ ఫోకస్ ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 30 , 2024 | 09:54 AM