ప్రతి అడుగు ప్రజల కోసమే: చంద్రబాబు
ABN, Publish Date - Jun 12 , 2024 | 09:28 AM
అమరావతి: మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకోవడం ఉండదు..అమరావతియే మన రాజధాని.. విశాఖను ఆర్థిక రాజధానిగా.. ప్రత్యేకమైన సిటీగా తయారు చేసుకుందాం.. కర్నూలును అభివృద్ధి చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్ఘటించారు.
అమరావతి: మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకోవడం ఉండదు..అమరావతియే మన రాజధాని.. విశాఖను ఆర్థిక రాజధానిగా.. ప్రత్యేకమైన సిటీగా తయారు చేసుకుందాం.. కర్నూలును అభివృద్ధి చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్ఘటించారు. నిన్న (మంగళవారం) విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ఆయన వారినుద్దేశించి ప్రసంగించారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో బుధవారం నుంచే ప్రజాపరిపాలన సాగుతుందన్నారు. ప్రతి అడుగు ప్రజల కోసమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. తాను చాలా ఎన్నికలు చూశానని, ప్రజలు ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని తీర్పు ఇచ్చారని, ఈ తీర్పును నిలబెట్టుకునే బాధ్యత మనపై ఉందని చంద్రబాబు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ: వైసీపీ నేతల్లో కొత్త భయం
ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు..
అమిత్ షాకు బీజేపీ నేతల ఘన స్వాగతం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jun 12 , 2024 | 09:28 AM