ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు..
ABN, Publish Date - Jun 12 , 2024 | 07:39 AM
న్యూఢిల్లీ: ఈ నెల 24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగనున్నాయి. రెండు రోజులపాటు ఎంపీల ప్రమాణస్వీకారం ఉండనుంది. 24, 25 తేదీల్లో ఎన్నికైన ఎంపీలందరూ ప్రమాణం చేయనున్నారు.
న్యూఢిల్లీ: ఈ నెల 24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగనున్నాయి. రెండు రోజులపాటు ఎంపీల ప్రమాణస్వీకారం ఉండనుంది. 24, 25 తేదీల్లో ఎన్నికైన ఎంపీలందరూ ప్రమాణం చేయనున్నారు. ఇదిలా ఉంటే.. కొత్త స్పీకర్ ఎంపిక జరిగేంతవరకు ప్రొటెన్ స్పీకర్ ఉంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటెన్ స్పీకర్ను నియమించనున్నారు. ప్రొటెన్ స్పీకర్ ఆధ్వర్యంలో ఎంపీలంతా ప్రమాణం చేయనున్నారు. అనంతరం ఈనెల 26న కొత్త స్పీకర్ ఎంపిక జరగనుంది. అటు తర్వాత జులై 3 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. కాగా లోక్ సభ స్పీకర్ పదవిపై ఎన్డీయే కూటమిలో గట్టి పోటీ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అమిత్ షాకు బీజేపీ నేతల ఘన స్వాగతం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jun 12 , 2024 | 08:04 AM