ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝి

ABN, Publish Date - Jun 12 , 2024 | 08:08 AM

భువనేశ్వర్: ఒడిశాలో తొలిసారి బీజేపీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝి పేరును కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. భువనేశ్వర్‌లో జరిగిన బీజేపీఎల్సీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

భువనేశ్వర్: ఒడిశాలో తొలిసారి బీజేపీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝి పేరును కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. భువనేశ్వర్‌లో జరిగిన బీజేపీఎల్సీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ భేటీకి బీజేపీ అధిష్టానం తరఫున పరిశీలకులుగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన మాఝి ఇప్పటి వరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కియోంజర్ స్థానం నుంచి విజయం సాధించారు. రెండున్నర దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝి బాధ్యతలు చేపట్టనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు..

అమిత్ షాకు బీజేపీ నేతల ఘన స్వాగతం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 12 , 2024 | 08:08 AM