వెంకట్రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం...
ABN, Publish Date - Sep 13 , 2024 | 10:53 AM
అమరావతి: మాజీ సీఎం జగన్ అండతో గనులశాఖను సొంత సామ్రాజ్యంగా మలుచుకున్న అప్పటి డైరెక్టర్ వెంకట్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. కుట్ర, అవినీతి, దోపిడీ కేసులో తొలి నిందితుడు.. ఏ1గా వెంకట్ రెడ్డి పేరును చేర్చింది. మరో ముగ్గిరిపై కూడా కేసు నమోదైంది.
అమరావతి: మాజీ సీఎం జగన్ అండతో గనులశాఖను సొంత సామ్రాజ్యంగా మలుచుకున్న అప్పటి డైరెక్టర్ వెంకట్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. కుట్ర, అవినీతి, దోపిడీ కేసులో తొలి నిందితుడు.. ఏ1గా వెంకట్ రెడ్డి పేరును చేర్చింది. మరో ముగ్గిరిపై కూడా కేసు నమోదైంది. వారిలో గనులశాఖలో మరో కీలక అధికారి పేరు ఉన్నట్లు సమాచారం. ఇసుక కాంట్రాక్టు చేసిన జేపీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరో ఇద్దరి పేర్లను కూడా త్వరలో చేర్చనున్నట్లు సమాచారం.
ఇసుక వ్యవహారంలో దాదాపు రూ. 2,500 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వెంకట్ రెడ్డిని త్వరలో అరెస్టు చేసే అవకాశముంది. విచారణకు హాజరు కావాల్సిందిగా తొలుత అవినీతి నిరోధక చట్టం కింద నోటీసులు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే వెంకట్ రెడ్డి నివాసం ఉంటునట్లు నిఘా వర్గాల సమాచారం. వెంకట్ రెడ్డిని ఏసీబీ అరెస్టు చేయాలనుకుంటే ఎవరి అనుమతి పొందాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
రానివ్వండి.. వాళ్లు వస్తే స్వాగతిస్తా: ఎమ్మెల్యే గాంధీ
నేడు చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపు
అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో హరీష్రావు నిరసన..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 13 , 2024 | 10:53 AM