రానివ్వండి.. వాళ్లు వస్తే స్వాగతిస్తా: ఎమ్మెల్యే గాంధీ

ABN, Publish Date - Sep 13 , 2024 | 10:29 AM

హైదరాబాద్: ఛలో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపిచ్చింది. ఈ కార్యక్రమానికి రావాలని పార్టీ నేతలకు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబిపూర్ ఈరోజు ఉదయం 11గంటలకు మల్లంపేటలోని శంభిపూర్ రాజు నివాసం నుంచి భారీ ర్యాలీగా ఎమ్మెల్యే గాంధీ ఇంటికి బీఆర్ఎస్ నేతలు బయలుదేరనున్నారు.

హైదరాబాద్: ఛలో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపిచ్చింది. ఈ కార్యక్రమానికి రావాలని పార్టీ నేతలకు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు పిలుపిచ్చారు. శుక్రవారం ఉదయం 11గంటలకు మల్లంపేటలోని శంభిపూర్ రాజు నివాసం నుంచి భారీ ర్యాలీగా ఎమ్మెల్యే గాంధీ ఇంటికి బీఆర్ఎస్ నేతలు బయలుదేరనున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గాంధీ ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. ‘‘రానివ్వండి.. వాళ్లు వస్తే స్వాగతిస్తా.. వచ్చేది నా మిత్రులే.. టేబులు వేసా, కుర్చీలు వేసా.. చక్కటి సమావేశం జరుపుకుంటాం’’ అని అన్నారు. తన ఇంటికి విరోధి వచ్చినా గౌరవిస్తానని.. ఎవరైనా ఇంటికి వస్తే మర్యాద చేసి పంపుతానని.. అది తన సంస్కారం అని గాంధీ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేడు చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపు

అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌లో హరీష్‌రావు నిరసన..

సీతారాం ఏచూరీ సంతాపసభ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 13 , 2024 | 10:29 AM