Share News

TG Politics: జగదీష్‌రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారు.. ఎమ్మెల్యే వేముల వీరేశం హాట్ కామెంట్స్

ABN , Publish Date - Mar 25 , 2024 | 10:46 PM

జిల్లాలో భూకబ్జాలకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ( Jagadish Reddy) పాల్పడ్డారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham) అన్నారు. సోమవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగదీష్ రెడ్డి జిల్లాలో భూకబ్జాలకు పాల్పడ్డారని.. పేదలను ఇబ్బందులకు గురించేశారని మండిపడ్డారు.

TG Politics: జగదీష్‌రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారు..  ఎమ్మెల్యే వేముల వీరేశం హాట్ కామెంట్స్

నల్గొండ: జిల్లాలో భూకబ్జాలకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ( Jagadish Reddy) పాల్పడ్డారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham) అన్నారు. సోమవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగదీష్‌రెడ్డి జిల్లాలో భూకబ్జాలకు పాల్పడ్డారని.. పేదలను ఇబ్బందులకు గురించేశారని మండిపడ్డారు.

రూ. లక్ష 50 వేల ఎకరాల భూములను జగదీష్‌రెడ్డి , ఆయన బినామీలు కొల్లగొట్టారని ఆరోపించారు. ఊరు, సర్వే నెంబర్లతో సహా ఆధారాలతో నిరూపించడానికి తాను సిద్ధమని సవాల్ విసిరారు. తన సవాల్‌ను జగదీష్‌రెడ్డి స్వీకరించాలని అన్నారు. భూకబ్జాలపై త్వరలో సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తానని చెప్పారు. జగదీష్‌రెడ్డి కొల్లగొట్టిన భూములను తిరిగి ప్రజలకు పంచాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 10:47 PM