Share News

Union Minister: విమర్శించిన వారికి ఓటు ద్వారా గుణపాఠం చెప్పారు..

ABN , Publish Date - Jun 11 , 2024 | 10:42 AM

అంబర్‌పేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టలేదని విమర్శలు చేసిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నేతలకు ప్రజలు ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) అన్నారు.

Union Minister: విమర్శించిన వారికి ఓటు ద్వారా గుణపాఠం చెప్పారు..

- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్: అంబర్‌పేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టలేదని విమర్శలు చేసిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నేతలకు ప్రజలు ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) అన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి(Former MLA Chintala Ramchandra Reddy), సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతమ్‌రావు, మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌గౌడ్‌, కోశాధికారి ఏ.సూర్యప్రకా్‌షసింగ్‌, అధికార ప్రతినిధి ఏడెల్లి అజయ్‌కుమార్‌, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎక్కాల నందు, ఎక్కాల కన్నా తదితరులు కలిసి శాలువా, పూలబోకేతో ఘనంగా సత్కరించారు.


ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అంబర్‌పేట ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ఈ నియోజకవర్గ ప్రజలు అందించిన మెజారిటీతోనే ఎంపీగా రెండోసారి గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నానని అన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 11 , 2024 | 10:45 AM