Share News

Padma Vibhushan Award: చిరంజీవికి ‘భారతరత్న’ కూడా రావాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ABN , Publish Date - Jan 26 , 2024 | 12:46 PM

పద్మవిభూషణ్ అవార్డు రావడంతో మెగాస్టార్ చిరంజీవికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో గల చిరంజీవి ఇంటికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లారు. చిరంజీవికి శాలువా కప్పి సత్కరించారు.

Padma Vibhushan Award: చిరంజీవికి ‘భారతరత్న’ కూడా రావాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: పద్మవిభూషణ్ (Padma Vibhushan Award) అవార్డు మెగాస్టార్ చిరంజీవికి రావడంతో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. జూబ్లీహిల్స్‌లో గల చిరంజీవి ఇంటికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లారు. చిరంజీవికి శాలువా కప్పి సత్కరించారు. చిరంజీవి ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. చిరంజీవి భారతరత్న స్వీకరించాలని మంత్రి వెంకట్ రెడ్డి అభిలాషించారు. రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది గుండెల్లో చిరంజీవి చిరస్థాయిగా నిలిచిపోయారని మంత్రి వెంకట్ రెడ్డి ప్రశంసించారు. చిరంజీవిని కలిసిన వారిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, రాజా రవీంద్ర ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 26 , 2024 | 12:47 PM