Congress: లోక్సభ నియోజకవర్గాలకు ఇంచార్జ్లను ప్రకటించిన కాంగ్రెస్.. హైదరాబాద్కు ఎవరంటే..
ABN , Publish Date - Mar 31 , 2024 | 10:06 PM
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ నియోజకవర్గాలకు ఇంచార్జ్లను ప్రకటించింది. మొత్తం 17 నియోజకవర్గాలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఇంచార్జ్లను ప్రకటించారు.
హైదరాబాద్: త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ నియోజకవర్గాలకు ఇంచార్జ్లను ప్రకటించింది. మొత్తం 17 నియోజకవర్గాలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఇంచార్జ్లను ప్రకటించారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి ఇంచార్జ్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్లగొండ ఇంచార్జ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. కరీంనగర్కు పొన్నం ప్రభాకర్, పెద్దపల్లికి శ్రీధర్ బాబు, వరంగల్కు రేవూరి ప్రకాష్ రెడ్డి, మహాబూబాబాద్కు తుమ్మల నాగేశ్వరరావు, హైదరాబాద్కు ఓబెదుల్లా కొత్వాల్, సికింద్రాబాద్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాగర్ కర్నూల్కు జూపల్లి కృష్ణారావు, మహబూబ్నగర్కు సంపత్ కుమార్, చేవెళ్లకు వేం నరేందర్ రెడ్డి, మల్కాజిగిరికి మైనంపల్లి హనుమంతరావు, మెదక్కు కొండా సురేఖ, నిజామాబాద్కు సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్కు సీతక్క, జహీరాబాద్కు దామోదర రాజనర్సింహను ఇంచార్జ్గా నియమించారు. కాగా రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పని చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
YS Sharmila: ఢిల్లీ చేరుకున్న షర్మిల.. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కసరత్తు
TS News: హామీలను నెరవేర్చాలని కోరుతూ మంగళవారం బండి సంజయ్ రైతు దీక్ష