Share News

TS News: హామీలను నెరవేర్చాలని కోరుతూ మంగళవారం బండి సంజయ్ రైతు దీక్ష

ABN , Publish Date - Mar 31 , 2024 | 08:36 PM

మంగళవారం కరీంనగర్‌లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay Kumar) రైతు దీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, రూ.500 బోనస్ హామీలను నేరవేర్చాలని దీక్షలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు.

TS News: హామీలను నెరవేర్చాలని కోరుతూ మంగళవారం బండి సంజయ్ రైతు దీక్ష

కరీంనగర్: మంగళవారం కరీంనగర్‌లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay Kumar) రైతు దీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, రూ.500 బోనస్ హామీలను నేరవేర్చాలని దీక్షలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. అలాగే సోమవారం కరీంనగర్ ఎంపీ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో వినతి పత్రం అందజేయనున్నారు. వడ్ల కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో రైతులతో కలిసి ఆందోళనలు చేపట్టాలని బండి సంజయ్ నిర్ణయించారు. వడ్ల కల్లాల వద్ద రైతులతో కలిసి రాత్రి బండి సంజయ్ బస చేయనున్నారు. ఈ రైతు దీక్షకు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Updated Date - Mar 31 , 2024 | 08:36 PM