Share News

Kaleswaram Project: మేడిగడ్డ దిగువభాగంలోనూ పరీక్షలు..

ABN , Publish Date - Apr 19 , 2024 | 08:42 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని(Kaleswar Project) మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగుబాటుకు గల కారణాలను అన్వేషిండానికి వీలుగా బ్యారేజీ దిగువ భాగంలోనూ సాంకేతిక పరీక్షలు(Technical Tests) నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బ్యారేజీల్లోని అన్ని బ్లాకుల్లో..

Kaleswaram Project: మేడిగడ్డ దిగువభాగంలోనూ పరీక్షలు..
Medigadda Barrage

  • అన్ని బ్లాకుల్లో ఈఆర్‌టీ, జీపీఆర్‌ పరీక్షలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని(Kaleswar Project) మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగుబాటుకు గల కారణాలను అన్వేషిండానికి వీలుగా బ్యారేజీ దిగువ భాగంలోనూ సాంకేతిక పరీక్షలు(Technical Tests) నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బ్యారేజీల్లోని అన్ని బ్లాకుల్లో సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం విదితమే. 8 బ్లాకుల్లో ఈ బ్యారేజీ నిర్మించగా 6, 7 బ్లాకుల్లోని ఎగువ భాగంలో ఇప్పటికే ఎలక్ట్రో రెసిస్టివిటీ టెస్ట్‌(ఈఆర్‌టీ), గ్రౌండ్‌ పినట్రేటింగ్‌ రాడార్‌ టెక్నికల్‌(జీపీఆర్‌) టెస్టులు నిర్వహించి నివేదికలు జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీకి అందించారు. తాజాగా దిగువ భాగంతో పాటు ఇతర బ్లాకుల్లోని ఎగువ, దిగువ భాగాల్లోనూ ఈఆర్‌టీ, జీపీఆర్‌ పరీక్షలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రానున్న పది రోజుల్లో పరీక్షలు పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవికూడా చదవండి:

టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..

బస్సు లోపల్నుంచే జగన్ షో!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2024 | 08:42 AM