Share News

TS NEWS: రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతున్న గుర్తుతెలియని మహిళ మృతదేహం

ABN , Publish Date - Jan 08 , 2024 | 08:00 PM

మొయినాబాద్ మండలంలో గల బాకారం గ్రామ రెవెన్యూలోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పక్కన గుర్తుతెలియని మహిళ మృతదేహం సోమవారం కలకలం రేపింది. కాగా.. మహిళ మృతదేహం మంటల్లో కాలుతున్నట్లుగా స్థానికులు గుర్తించారు. వారు వెంటనే మొయినాబాద్ పోలీసులకు సమాచారం అందజేశారు.

TS NEWS: రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతున్న గుర్తుతెలియని మహిళ మృతదేహం

రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్ మండలంలో గల బాకారం గ్రామ రెవెన్యూలోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పక్కన గుర్తుతెలియని మహిళ మృతదేహం సోమవారం కలకలం రేపింది. కాగా.. మహిళ మృతదేహం మంటల్లో కాలుతున్నట్లుగా స్థానికులు గుర్తించారు. వారు వెంటనే మొయినాబాద్ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చారు. పోలీసులు వచ్చే వరకు కూడా మహిళ మృతదేహం కాలుతునే ఉంది. మంటలను పోలీసులు ఆర్పి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మృతదేహం పక్కన సగం కాలిన ఫోన్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమె హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఆ మహిళను ఎక్కడో హత్యచేసి ఇక్కడకు తీసుకొచ్చి తగులబెట్టారా.. లేక ఇక్కడే హత్య చేసి మృతదేహన్ని తగులబెట్టారా అనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఆధారాల కోసం క్లూస్ టీమ్‌ని రంగంలోకి దింపారు. చుట్టూ పక్కల ఉన్న వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఆధారాల కోసం ఆ ఏరియాలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాజేంద్ర నగర్ అడిషనల్ డీసీపీ సాధన రేష్మి పెరుమాళ్ ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.

Updated Date - Jan 08 , 2024 | 08:00 PM