Share News

TS NEWS: మేడ్చల్‌లో భారీగా గంజాయి పట్టివేత

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:06 PM

నగరంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ పెంట్ హౌస్‌పై బాలనగర్ ఎస్ఓటి పోలీసుల దాడి చేశారు. 86కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వెంకటసాయి క్రిష్ణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

TS NEWS: మేడ్చల్‌లో భారీగా గంజాయి పట్టివేత

మేడ్చల్: నగరంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ పెంట్ హౌస్‌పై బాలనగర్ ఎస్ఓటి పోలీసుల దాడి చేశారు. 86కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వెంకటసాయి క్రిష్ణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం (సిలేరు) నుంచి హైదరాబాద్‌కి JCB టైర్లలో ఫ్యాక్ చేసి బొలెరో వాహనంలో గణేష్ అనే వ్యక్తి పంపించాడు. హైదరాబాద్ నుంచి రాజస్తాన్‌కు సప్లాయి చేసేందుకు వెంకటసాయి క్రిష్ణ రెడీగా ఉన్నాడు. ఈ సమయంలోనే ఇంటిపై పోలీసుల దాడి చేసి 86 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వెంకటసాయి క్రిష్ణ గంజాయి కేసుల్లో పాత నేరస్థుడిగా పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించినట్లు జీడిమెట్ల సీఐ శ్రీనివాస్ రావు తెలిపారు.

Updated Date - Jan 05 , 2024 | 11:06 PM