Share News

Chandrababu: చంద్రబాబును కలిసిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్.. కారణమేంటంటే..

ABN , Publish Date - Mar 18 , 2024 | 01:18 PM

టీడీపీ అధినేత చంద్రబాబును ఇవాళ అదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కలిశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది? రమేష్ రాథోడ్ ఎందుకు చంద్రబాబుని కలిశారనే చర్చ తెలంగాణలో ప్రారంభమైంది. రమేష్ రాథోడ్ మాత్రం తాను మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలవడానికి వచ్చానని చెబుతున్నారు.

Chandrababu: చంద్రబాబును కలిసిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్.. కారణమేంటంటే..

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను ఇవాళ అదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ (Ramesh Rathod) కలిశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది? రమేష్ రాథోడ్ ఎందుకు చంద్రబాబుని కలిశారనే చర్చ తెలంగాణ (Telangana)లో ప్రారంభమైంది. రమేష్ రాథోడ్ మాత్రం తాను మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలవడానికి వచ్చానని చెబుతున్నారు. సుదీర్ఘ కాలం పాటు టీడీపీ (TDP)లో పని చేసిన ఆయనకు చంద్రబాబుతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తిరిగి ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం ప్రధాని మోదీ (PM Modi)కి సిఫార్సు చేయాలని చంద్రబాబును రమేష్ రాథోడ్ కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది.

Tamilisai: తమిళిసై రాజీనామాకు కారణాలేంటి?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 01:18 PM