Share News

PM Modi: బోధన్ ఆర్‌వోబీ, జడ్చర్ల అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

ABN , Publish Date - Feb 26 , 2024 | 02:05 PM

నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.

PM Modi: బోధన్ ఆర్‌వోబీ, జడ్చర్ల అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

నిజామాబాద్: నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. బోధన్ పట్టణంలో ఆర్‌వోబీ నిర్మాణ పనులకు ప్రధాని మోదీ (PM Modi) శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Arvind), బీజేపీ నేతలు పాల్గొన్నారు. తర్వాత మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల రైల్వేస్టేషన్‌లో అమృత్ భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితర నేతలు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 02:05 PM