Share News

TS News: కోకాపేటలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. ఓ వ్యక్తిని ఆటోలో ఎక్కించుకుని..

ABN , Publish Date - Apr 15 , 2024 | 09:42 AM

కోకాపేటలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఆటో కోసం వేచి చూస్తున్న వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఆటోలో ఎక్కించుకొని మరీ దోపిడీ దొంగలు వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడి జోబులో ఉన్న నాలుగున్నర వేల రూపాయల నగదును తీసుకొని ఆటోలో నుంచి తోసేసి వెళ్లిపోయారు.

TS News: కోకాపేటలో రెచ్చిపోయిన  దోపిడీ దొంగలు.. ఓ వ్యక్తిని ఆటోలో ఎక్కించుకుని..

హైదరాబాద్: కోకాపేటలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఆటో కోసం వేచి చూస్తున్న వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఆటోలో ఎక్కించుకొని మరీ దోపిడీ దొంగలు వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడి జోబులో ఉన్న నాలుగున్నర వేల రూపాయల నగదును తీసుకొని ఆటోలో నుంచి తోసేసి వెళ్లిపోయారు. బాధితుడు నార్సింగి పోలీసుల (Police)కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోలో ముగ్గురు వచ్చినట్లు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కోకాపేట సర్వీసు రోడ్డులో ఇలాంటి వరుస ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇది వరుసగా ఐదవ ఘటన కావడం గమనార్హం. ఒంటరిగా ఉన్న వ్యక్తులను రాబరీ గ్యాంగ్ టార్గెట్ చేస్తోంది.

13 ఏళ్ల అబ్బాయి.. నాన్నమ్మను పొడిచాడు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 15 , 2024 | 09:48 AM