Share News

KTR: తెలంగాణను కన్నీటి సాగుకు కేరాఫ్‌గా మారిస్తే సహించేదిలే..!

ABN , Publish Date - Mar 01 , 2024 | 09:08 AM

మళ్లీ తెలంగాణను ఎడారిగా మార్చే కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టడానికే... ఈ ‘చలో మేడిగడ్డ’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. చిన్న లోపాన్ని.. పెద్ద భూతద్దంలో చూపిస్తూ.. బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేందుకే... ఈ ‘చలో మేడిగడ్డ’ అని తెలిపారు. ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును పరిరక్షించకుండా.. కూలిపోవాలని చూస్తున్న కాంగ్రెస్ కుతంత్రాన్ని ప్రజల సాక్షిగా నిలదీయడానికే.. ఈ ‘చలో మేడిగడ్డ’ అని కేటీఆర్ అన్నారు.

KTR: తెలంగాణను కన్నీటి సాగుకు కేరాఫ్‌గా మారిస్తే సహించేదిలే..!

హైదరాబాద్: మళ్లీ తెలంగాణ (Telangana)ను ఎడారిగా మార్చే కాంగ్రెస్ (Congress) కుట్రలను ఎండగట్టడానికే... ఈ ‘చలో మేడిగడ్డ’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. చిన్న లోపాన్ని.. పెద్ద భూతద్దంలో చూపిస్తూ.. బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేందుకే... ఈ ‘చలో మేడిగడ్డ’ అని తెలిపారు. ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును పరిరక్షించకుండా.. కూలిపోవాలని చూస్తున్న కాంగ్రెస్ కుతంత్రాన్ని ప్రజల సాక్షిగా నిలదీయడానికే.. ఈ ‘చలో మేడిగడ్డ’ అని కేటీఆర్ అన్నారు.

AP News: ఇంటికి వస్తే శరీరంలో పార్టులు తీసేస్తానంటూ నల్లమిల్లికి వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్


పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో పండుగలా మారిన వ్యవసాయాన్నిమళ్లీ దండగలా మార్చే కాంగ్రెస్ పన్నాగాలకు పాతరేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పంజాబ్‌నే తలదన్నే స్థాయికి ఎదిగిన తెలంగాణ రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న కాంగ్రెస్ నీచ సంస్కృతికి సమాధి కట్టేందుకే ఈ ‘చలో మేడిగడ్డ’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మరమ్మత్తులు కూడా చేతకాని “గుంపుమేస్త్రీ”ని నమ్ముకుంటే తెలంగాణ రైతు నిండా మునుగుడేనని మరోసారి చాటిచెప్పేందుకే ఈ కార్యక్రమమని అన్నారు.

Srisailam: శ్రీశైలంలో నేటి నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు..

దశాబ్దాలపాటు.. కాంగ్రెస్ చేసిన తప్పులను.. కాంగ్రెస్ పాలనలో సాగునీటి తిప్పలను.. అరవై ఏళ్లు కాంగ్రెస్ పెట్టిన అరిగోసను అన్నదాతలు మరువలేదని గుర్తుచేస్తామని కేటీఆర్ తెలిపారు. మళ్లీ కన్నీటి సాగుకు తెలంగాణను కేరాఫ్ గా మారిస్తే సహించబోమన్నారు. మీ దుష్ట రాజకీయాల కోసం.. మా తెలంగాణ రైతాంగాన్ని బలిచేస్తే భరించేది లేదన్నారు. పోటీ యాత్రలు చేయడం కాదని.. ప్రజలు అప్పగించిన డ్యూటీ చేయాలన్నారు. మేడిగడ్డకు మరణశాసనం రాయాలని చూస్తే... తెలంగాణ గడ్డపై.. కాంగ్రెస్ కే నూకలు చెల్లడం ఖాయమన్నారు. వచ్చే వరదల్లో.. కాంగ్రెస్ పార్టీయే కొట్టుకుపోవడం తథ్యమని కేటీఆర్ అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2024 | 09:18 AM