Share News

Kishan Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు..

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:11 PM

నేడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. రైతులు, మహిళలు, యూత్‌ టార్గెట్‌గా ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో నోట్ల ముద్రణ ఏమైనా చేస్తారేమో... తెలియడం లేదని వ్యంగ్యాస్త్రాలు పేల్చారు.

Kishan Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు..

హైదరాబాద్: నేడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. రైతులు, మహిళలు, యూత్‌ టార్గెట్‌గా ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో నోట్ల ముద్రణ ఏమైనా చేస్తారేమో... తెలియడం లేదని వ్యంగ్యాస్త్రాలు పేల్చారు. శాసనసభ ఎన్నికల్లో డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన అనేక హామీలను ముందుగా కాంగ్రెస్ అమలు చేయాలన్నారు.

Danam Nagender: ఐపీఎల్ టికెట్ల అమ్మకంపై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు

యూత్ డిక్లరేషన్, మహిళ డిక్లరేషన్, ఎస్సీ.. ఎస్టీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు ముందుగా అమలు చేయాలన్నారు. దళితుడని బాబూ జగ్జీవన్ రామ్‌ను ప్రధాని కాకుండా కాంగ్రెస్ అడ్డుకుందన్నారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలను జగ్జీవన్ రామ్ వ్యతిరేకించారన్నారు. ప్రజల హక్కులను పరిరక్షించటానికి జగ్జీవన్ రామ్ పోరాటం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

KCR: కేసీఆర్ పొలం బాట.. కరీంనగర్‌కు పయనం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 05 , 2024 | 02:31 PM