Home » Lok Sabha Election 2024 Live Updates
Lok Sabha Election 2024 Live Updates in Telugu: దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల 4వ విడత పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. నాలుగో విడతలో భాగంగా నేడు నాడు దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఏకకాలంలో పోలింగ్ జరగనుంది.
పోలింగ్ రోజు కూడా వైసీపీ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. పల్నాడు జిల్లా టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్బాబును(Chadalavada Arvind Babu) వైసీపీ మూకలు టార్గెట్ చేశారు.
తెలంగాణలో సమస్యాత్మక ప్రాంతాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే ఇప్పటికే క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు.
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Polls 2024), పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పోలింగ్ ముగిశాక ఈవీఎం మిషన్లను ఏం చేస్తారనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా. ఈవీఎంల(EVMs) భద్రత ఎలా ఉంటుంది, రీకౌంటింగ్కు పట్టుబడితే పరిస్థితి ఏంటి తదితర వివరాలు తెలుసుకుందాం.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోల్ - జోగిపేట పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Rajanarsimha) కుమార్తె త్రిషతో కలిసి 196వ పోలింగ్ బూత్లో ఓటు వేశారు.
సిద్దిపేట జిల్లా చింతమడకలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) ఆయన సతీమణి శోభతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు బీఆర్ఎస్(BRS) నేతలు ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. లోక్ సభ స్థానాలకుగానూ ఉదయం 11 గంటల వరకు ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 32.78 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ శాతం నమోదైంది. తాజాగా ఎన్నికల అధికారులు ఉదయం 11 గంటల వరకు పోలింగ్ పర్సంటేజ్ని పరిశీలిద్దాం.
తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. తెలంగాణలో 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ శాతం నమోదైంది. పలు జిల్లాల్లో పోలింగ్ పర్సంటేజీని పరిశీలిద్దాం.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మంత్రులు తమ నియోజకవర్గా్ల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.