Share News

Road Accident: కిష్టారంలో దారుణ ఘటన.. రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి..

ABN , Publish Date - Jun 03 , 2024 | 09:21 PM

సత్తుపల్లి(Sathupally) మండలం‌ కిష్టారం(Kishtaram) ఓసీ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ(Lorry) ఢీకొట్టడంతో తండ్రి, కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు కిష్టారం గ్రామానికి చెందిన పిల్లి పేరయ్య(52), కుమారుడు అశోక్(30)గా గుర్తించారు.

Road Accident: కిష్టారంలో దారుణ ఘటన.. రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి..

ఖమ్మం: సత్తుపల్లి(Sathupally) మండలం‌ కిష్టారం(Kishtaram) ఓసీ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ(Lorry) ఢీకొట్టడంతో తండ్రి, కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు కిష్టారం గ్రామానికి చెందిన పిల్లి పేరయ్య(52), కుమారుడు అశోక్(30)గా గుర్తించారు. వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు శోకసద్రంలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి:

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసు ఛార్జ్ షీట్‌లో ఈడీ సంచలన విషయాలు వెల్లడి..

Crime News: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ కలకలం..

For more Telangana news and Telugu news..

Updated Date - Jun 03 , 2024 | 09:21 PM