Share News

Bandi Sanjay: కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే బతుకులు ఆగం అవుతాయి

ABN , Publish Date - Mar 06 , 2024 | 08:02 PM

కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే బతుకులు ఆగం అవుతాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. బుధవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి... ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిస్తే తప్పేందని ప్రశ్నించారు.

Bandi Sanjay: కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే బతుకులు ఆగం అవుతాయి

కరీంనగర్: కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే బతుకులు ఆగం అవుతాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. బుధవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి... ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిస్తే తప్పేందని ప్రశ్నించారు.

రేవంత్... భవిష్యత్తులోనూ ఇదే పంథా కొనసాగించాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ తూర్పు పడమర పార్టీలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు. మహిళలకు రూ.2500లు, పెన్షన్ రూ.4 వేలు, రూ.2 లక్షల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను మాజీ సీఎం కేసీఆర్ ఏనాడూ ఆలోచించలేదని అన్నారు. ప్రధాని మోదీ వస్తే గతంలో దొంగలా దాక్కున్న నేత కేసీఆర్ అని ఆరోపించారు. ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ కరీంనగర్‌లో సభ పెడుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 08:05 PM