Share News

Hyderabad: ఆ అధికారి చర్యతో ప్రభుత్వానికి వేల కోట్లు నష్టం.. వెలుగులోకి సంచలన విషయాలు..

ABN , Publish Date - Mar 21 , 2024 | 02:15 PM

హెచ్ఎండిఏ కృష్ణకుమార్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు కృష్ణకుమార్, శివబాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. కృష్ణకుమార్ ను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

Hyderabad: ఆ అధికారి చర్యతో ప్రభుత్వానికి వేల కోట్లు నష్టం.. వెలుగులోకి సంచలన విషయాలు..

హెచ్ఎండిఏ కృష్ణకుమార్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు కృష్ణకుమార్, శివబాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. కృష్ణకుమార్ ను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్న కృష్ణ కుమార్ బడా బిల్డర్లతో కుమ్మక్కై టీడీఆర్ ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు నష్టం చేశారనే అభియోగాలు ఉన్నాయి. బిల్డర్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఫైల్స్ క్లియర్ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కృష్ణకుమార్ చేసిన పని వల్ల ప్రభుత్వానికి రూ.3800 కోట్లు నష్టం జరిగిందని‌ ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆయనతో పాటు మరో ఇద్దరు హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారుల పాత్ర పై ఏసీబీ ఆరా తీస్తోంది.

బడా బిల్డర్ల ప్రాజెక్టుల ప్లానింగ్ లో టీడీఆర్ విలువ తగ్గించి ప్రభుత్వానికి తక్కువ ఫీజులు కట్టించేలా చేసి గవర్నమెంట్ కు నష్టం కలిగించేలా చేశారు కృష్ణకుమార్. శివ బాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు కాగానే కృష్ణకుమార్ అమెరికాకు వెళ్లిపోయారు. ఆయనను అమెరికా నుంచి హైదరాబాద్ కు రప్పించడానికి ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Delhi: నిద్రలోనే కూలిపోయిన ప్రాణాలు.. భవనం కుప్పకూలి ఇద్దరు దుర్మరణం


కాగా.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసిస్టెంట్‌ ప్లానింగ్‌ అధికారి కృష్ణకుమార్ ను సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్‌ నంబర్లు, వాటి యజమానులు ఎవరు అన్న విషయాలను పరిశీలించకుండానే టీడీఆర్‌ కింద పరిహారాన్ని ఇవ్వాలని సిఫారసు చేశారు. దీంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Patanjali: తప్పుడు ప్రకటనల కేసు.. సుప్రీంకోర్టుకు పతంజలి క్షమాపణలు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 21 , 2024 | 02:15 PM