Share News

TS Politics: పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్

ABN , Publish Date - Jan 11 , 2024 | 10:26 AM

Telangana: పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. బీజేపీకి మాజీమంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ రాజీనామా చేశారు. త్వరలోనే విక్రమ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన విక్రమ్‌గౌడ్.. ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి లేఖ రాశారు.

TS Politics: పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్

హైదరాబాద్, జనవరి 11: పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీకి (Telangana BJP) పెద్ద షాక్ తగిలింది. బీజేపీకి మాజీమంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు, యువనేత విక్రమ్ గౌడ్ (Vikram Goud) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను.. పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి (Telangana BJP Chief Kishan Reddy) లేఖ రాశారు. పార్టీలో కొత్త వారిని అంటరాని వారుగా చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. క్రమశిక్షణకు మారు పేరంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పని చేసినా గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. ఏదో ఒక గ్రూప్ రాజకీయాలలో ఉంటేనే పార్టీలో మనుగడ అని చెప్పుకొచ్చారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారన్నారు. ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యత తీసుకోలేదని లేఖలో విక్రమ్‌గౌడ్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 11 , 2024 | 10:33 AM