Vasudeva Reddy: ఉద్యోగాల విషయంలో రేవంత్రెడ్డి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు
ABN , Publish Date - Feb 15 , 2024 | 08:16 PM
60 రోజుల రేవంత్ పాలన చూస్తుంటే పరిపాలన నిల్లు, పబ్లిసిటీ పుల్లు అనేలా ఉందని వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి(Vasudeva Reddy) సెటైర్లు గుప్పించారు.
![Vasudeva Reddy: ఉద్యోగాల విషయంలో రేవంత్రెడ్డి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు](https://media.andhrajyothy.com/media/2024/20240215/Vasudeva_Reddy_ab2ac585fc.jpg)
హైదరాబాద్: 60 రోజుల రేవంత్ పాలన చూస్తుంటే పరిపాలన నిల్లు, పబ్లిసిటీ పుల్లు అనేలా ఉందని వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి(Vasudeva Reddy) సెటైర్లు గుప్పించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో తాము ఇచ్చిన నోటిఫికేషన్లు అన్ని లెక్కలతో సహా చూపించామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన పనులను సీఎం రేవంత్రెడ్డి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు అన్ని తానే ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి శుభకానందం పొందుతున్నారని దెప్పిపొడిచారు. గురుకుల నియామకాలు సక్రమంగా జరగలేదన్నారు. డీఎల్, జేఎల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా పీజీటీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒత్తిడి వల్ల డీఎల్, జేఎల్ పక్కకు పోయాయని చెప్పారు. పీజీటీ పోస్టుల విషయంలో గజిబిజి గందరగోళంగా ఉందని వాసుదేవరెడ్డి మండిపడ్డారు.