Share News

Hyderabad: వీడు మనిషేనా.. భార్య బతికున్నా చనిపోయిందని చెబుతూ..!

ABN , Publish Date - Feb 20 , 2024 | 10:44 AM

ఆయన వృత్తి లాయర్.. ప్రవృత్తి పెళ్లిళ్లు చేసుకోవడం!. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా..? అవునండోయ్.. ఈ వ్యవహారం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది.. జరుగుతోంది!.

Hyderabad: వీడు మనిషేనా.. భార్య బతికున్నా చనిపోయిందని చెబుతూ..!

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఆయన వృత్తి లాయర్.. ప్రవృత్తి పెళ్లిళ్లు చేసుకోవడం!. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా..? అవునండోయ్.. ఈ వ్యవహారం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది.. జరుగుతోంది!. పేరు అమరేందర్.. ఎన్నిసార్లు, ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడో లెక్కలేదు. తవ్వేకొద్దీ ఈ నిత్య పెళ్లికొడుకు దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆడపిల్లలు పుడుతున్నారని భార్యకు అబార్షన్‌లు చేయించిన ఈ ప్రబుద్దుడు.. అంతటితో ఆగలేదు. భార్య బతికుండగానే చనిపోయిందంటూ మరోపెళ్లి చేసుకున్నాడు. ఇదిగో ఇక్కడ్నుంచే ఈ దుర్మార్గుడి లీలలు వెలుగులోకి వచ్చాయి.

అసలేం జరిగిందంటే..

అమరేందర్ అనే వ్యక్తి హైకోర్ట్‌లో న్యాయవాదిగా చలామణి అవుతున్నాడు. ఆడపిల్లలే పుడుతున్నారని భార్యకు నాలుగు సార్లు అబార్షన్ చేయించాడు. బాధితురాలికి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇల్లీగల్‌గా స్కాయింగ్ చేసి ఆడపిల్ల పుడుతుందని తెలియగానే నాలుగు సార్లు అబార్షన్ చేయించి నీచానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా భార్య బతికి ఉన్నా కూడా.. చనిపోయిందని చెప్పి వేరే పెళ్లి చేసుకున్నాడు. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారిన తరువాత తెలంగాణ రైతు రాజ్య సమితి (టీఆర్‌ఎస్)ని అమరేందర్ రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అమరేందర్ తండ్రి రిటైర్డ్ మెజిస్ట్రేట్ అంటూ పలువురిని మోసం చేస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. ఇప్పటికే సరూర్‌నగర్ ఉమెన్ పోలీస్‌స్టేషన్‌లో అమరేందర్‌పై కేసు నమోదు అయ్యింది. పలువురు బాధితులు అమరేందర్ బారినపడినట్లు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటున్నారు.

Updated Date - Feb 20 , 2024 | 01:20 PM