Share News

TS News: లోక్‌సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో కొలువుల జాతర

ABN , Publish Date - Feb 22 , 2024 | 01:51 PM

లోక్‌సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో కొలువుల జాతర ప్రారంభం కానుంది. కొత్త నోటిఫికేషన్‌లకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం యత్నిస్తోంది. వారం రోజుల్లో 11 వేల పోస్ట్‌లతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.

TS News: లోక్‌సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో కొలువుల జాతర

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల (Loksabha Elections) కంటే ముందే తెలంగాణ (Telangana)లో కొలువుల జాతర ప్రారంభం కానుంది. కొత్త నోటిఫికేషన్‌లకు రేవంత్ (CM Revanth Reddy) సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) యత్నిస్తోంది.

వారం రోజుల్లో 11 వేల పోస్ట్‌లతో మెగా డీఎస్సీ (DSC) నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. మరోవైపు సింగరేణి (Singareni)లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. 474 పోస్టుల భర్తీకి సింగరేణి అధికారులు కసరత్తు మమ్మరం చేశారు. నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti vikramarka)తో సింగరేణి అధికారులు సమావేశం అయ్యారు. ఇప్పటికే 563 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేశారు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అన్ని నోటిఫికేషన్‌లు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Updated Date - Feb 22 , 2024 | 01:54 PM