Share News

Jeevan Reddy: అరవింద్‌కు ఓటు అడిగే హక్కు లేదు

ABN , Publish Date - Feb 26 , 2024 | 07:24 PM

బీజేపీ ఎంపీ అరవింద్‌(Aravind)పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Jeevan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరవింద్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందా..? అని ప్రశ్నించారు.

Jeevan Reddy: అరవింద్‌కు ఓటు అడిగే హక్కు లేదు

జగిత్యాల: బీజేపీ ఎంపీ అరవింద్‌(Aravind)పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Jeevan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరవింద్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందా..? అని ప్రశ్నించారు. తనకు ఇన్నేళ్లకు షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకు వచ్చిందా..? అని నిలదీశారు. ఐదేళ్లలో ఎంపీగా ఉండి నిజామాబాద్‌కు ఏం చేశారు..? అని నిలదీశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని చూసి తనకు ఎందుకు ఓటు వేయాలి..? అని ప్రశ్నించారు. ఐదేళ్లలో జిల్లాకు ఏం చేయలేదని.. ఇప్పుడు ఎన్నికల సమయంలో రైతులు గుర్తుకు వచ్చారా..? అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 26 , 2024 | 07:24 PM