Share News

TS News: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు

ABN , Publish Date - Mar 08 , 2024 | 11:11 AM

Telangana: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సూర్యపేట జిల్లా మట్టంపల్లి గ్రామంలో న్యూదుర్గాభవని మెడికల్ షాపులో తనిఖీలు నిర్వహించారు. మెడికల్ షాప్ నిర్వాహకుడు రవీంద్రనాయక్ ఇంట్లో 10 రకాల మెడిసిన్స్... 20వేల414రూపాయల విలువగల 80 దగ్గు సిరప్స్, 150 నైట్రాజెపామ్‌ మాత్రలు సీజ్ చేశారు.

TS News: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు

హైదరాబాద్, మార్చి 8: తెలంగాణలో (Telangana) డ్రగ్ కంట్రోల్ అధికారులు (Drug Control Officers) తనిఖీలు చేపట్టారు. సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సూర్యపేట జిల్లా మట్టంపల్లి గ్రామంలో న్యూదుర్గాభవని మెడికల్ షాపులో తనిఖీలు నిర్వహించారు. మెడికల్ షాప్ నిర్వాహకుడు రవీంద్రనాయక్ ఇంట్లో 10 రకాల మెడిసిన్స్... 20వేల414రూపాయల విలువగల 80 దగ్గు సిరప్స్, 150 నైట్రాజెపామ్‌ మాత్రలు సీజ్ చేశారు. అలాగే హైదరాబాద్ సికింద్రాబాద్ తార్నాకలో అనధికారిక నిల్వలు, వైద్య పరికరాలు విక్రయిస్తున్న డీలర్ ఎంఎస్ మెడికల్ సిస్టమ్స్ వద్ద తనిఖీ చేపట్టారు. ఆపరేషన్ సమయంలో ఉపయోగించే నెబ్యులైజర్లు, స్టీమ్ స్టెరిలైజర్లు సహా వైద్య పరికరాల నిల్వలను డీసీఏ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 6.5 లక్షలుగా తెలుస్తోంది. నిర్వాహకుడు గుండా మహేశ్వరమూర్తిపై అధికారులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి..

Hyderabad: బ్యాంకు లావాదేవీలపై నిఘా.. వివరాలు ఇవ్వాలని బ్యాంకర్లకు రోనాల్డ్‌రోస్‌ సూచన

TDP: సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న లోకేష్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 08 , 2024 | 11:11 AM