Share News

Gellu Srinivas Yadav: సీఎం రేవంత్ ఫొటోలకు పోజులు తప్ప.. ఉద్యోగులకు ఏ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు

ABN , Publish Date - Feb 15 , 2024 | 08:22 PM

కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav) అన్నారు.

Gellu Srinivas Yadav: సీఎం రేవంత్ ఫొటోలకు పోజులు తప్ప.. ఉద్యోగులకు ఏ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav) అన్నారు. గురువారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలు, ఉద్యోగ నియామకాలకు నియామక పత్రాలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల నియామక పత్రాలను ఎల్బీ స్టేడియంలో మీటింగ్‌లు పెట్టి అభ్యర్థులకు ఇస్తున్నారని చెప్పారు.

ఫొటోలకు పోజులు ఇస్తున్నారు.. తప్ప సీఎం రేవంత్‌రెడ్డి కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. దమ్ముంటే ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అసెంబ్లీ సమావేశాల్లో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత అధికారికంగా సమావేశాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. లోక్ సభ ఎన్నికల ముందే నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని గెల్లు శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.

Updated Date - Feb 15 , 2024 | 08:22 PM